Omar Abdullah: కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు.. ఎన్నికల కోసం అడుక్కోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: ఎన్నికలు ప్రజల హక్కు అని… జమ్మూకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కశ్మీరీలు కేంద్రం ముందు అడుక్కోరని.. వారు బిచ్చగాళ్లు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదని.. ఎన్నికలు మా హక్కు అని.. ఎవరి ముందు అడుక్కోము అని ఆయన తెలిపారు. కశ్మీరీలకు ఎన్నికలు జరగడం మంచిదే కానీ.. ఎన్నికల కోసం ఎవరినీ అడుక్కోరన్నారు.
ఆస్తులు, ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించడం గురించి అడిగిన ప్రశ్నకు.. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఇది ఒక కారణమని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. అందుకే వారు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారు ప్రజలను వేధించాలనుకుంటున్నారని.. తగిలిన గాయాలకు ఔషధతైలం పూయడానికి బదులుగా, వారు గాయాన్ని మరింత తీవ్రతరం చేయాలనే తపనతో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజల గాయాలను మాన్పడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ ప్రభుత్వానికి తెలుసునని, అయితే వారు కేవలం ఉప్పు, కారం రుద్దుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
Tamil Nadu: గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం.. కాకరేపుతోన్న “పొంగల్” ఇన్విటేషన్
రాజౌరి దాడి తరువాత గ్రామ రక్షణ గార్డులకు ఆయుధాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం గురించి అడిగిన ప్రశ్నకు.. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో దేశానికి చేసిన హామీలు పూర్తిగా విఫలమైనట్లు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన అన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లోని తుపాకీ సంస్కృతి తగ్గుముఖం పడుతుందని చెప్పబడింది. రాజౌరిలో ప్రస్తుతం జరుగుతున్న దాడులు, కాశ్మీర్లో పరిస్థితి, భద్రతా బలగాల సిబ్బంది సంఖ్యను పెంచడం.. ఇవన్నీ పరిస్థితి అదుపులోకి రాలేదనే వాస్తవాన్ని సూచిస్తున్నాయని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవలసి వచ్చిందన్నారు. రాజౌరి జిల్లా ధంగ్రీ గ్రామంలో జనవరి 1న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!