Omar Abdullah: కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు.. ఎన్నికల కోసం అడుక్కోరు
Omar Abdullah: ఎన్నికలు ప్రజల హక్కు అని… జమ్మూకశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని కశ్మీరీలు కేంద్రం ముందు అడుక్కోరని.. వారు బిచ్చగాళ్లు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదని.. ఎన్నికలు మా హక్కు అని.. ఎవరి ముందు అడుక్కోము అని ఆయన తెలిపారు. కశ్మీరీలకు ఎన్నికలు జరగడం మంచిదే కానీ.. ఎన్నికల కోసం ఎవరినీ అడుక్కోరన్నారు.
ఆస్తులు, ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించడం గురించి అడిగిన ప్రశ్నకు.. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఇది ఒక కారణమని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. అందుకే వారు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారు ప్రజలను వేధించాలనుకుంటున్నారని.. తగిలిన గాయాలకు ఔషధతైలం పూయడానికి బదులుగా, వారు గాయాన్ని మరింత తీవ్రతరం చేయాలనే తపనతో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజల గాయాలను మాన్పడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ ప్రభుత్వానికి తెలుసునని, అయితే వారు కేవలం ఉప్పు, కారం రుద్దుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Also Read
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Tamil Nadu: గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం.. కాకరేపుతోన్న “పొంగల్” ఇన్విటేషన్
రాజౌరి దాడి తరువాత గ్రామ రక్షణ గార్డులకు ఆయుధాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం గురించి అడిగిన ప్రశ్నకు.. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో దేశానికి చేసిన హామీలు పూర్తిగా విఫలమైనట్లు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన అన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లోని తుపాకీ సంస్కృతి తగ్గుముఖం పడుతుందని చెప్పబడింది. రాజౌరిలో ప్రస్తుతం జరుగుతున్న దాడులు, కాశ్మీర్లో పరిస్థితి, భద్రతా బలగాల సిబ్బంది సంఖ్యను పెంచడం.. ఇవన్నీ పరిస్థితి అదుపులోకి రాలేదనే వాస్తవాన్ని సూచిస్తున్నాయని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవలసి వచ్చిందన్నారు. రాజౌరి జిల్లా ధంగ్రీ గ్రామంలో జనవరి 1న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
-
IPL CheerLeaders Salary: గ్లామర్తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
-
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
-
CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!