Tamil Nadu: గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం.. కాకరేపుతోన్న “పొంగల్” ఇన్విటేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor vs CM in Tamil Nadu: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ ప్రభుత్వాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో గవర్నర్ రవి ప్రసంగంపై డీఎంకే పార్టీ మండిపడుతోంది. గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ అసెంబ్లీలోనే తీర్మానం పెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని అసెంబ్లీ తీర్మానించింది. ఈ చర్యతో అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు. దీని తర్వాత ‘గెట్ అవుట్ రవి’ యాష్ ట్యాగుని డీఎంకే పార్టీ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యేలా చేసింది.
Read Also: IND Vs SL: తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్లకు దక్కని చోటు
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ఇదిలా ఉంటే గవర్నర్ ‘పొంగల్’ ఆహ్వానం సరికొత్త వివాదానికి కేంద్ర బిందువు అయింది. గవర్నర్ ఈ ఆహ్వనంలో కేంద్ర ప్రభుత్వ చిహ్నాన్ని మాత్రమే ఉపయోగించారని.. రాష్ట్ర చిహ్నాన్ని ఉపయోగించలేదని ద్రావిడ పార్టీలు మండిాపడుతున్నాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి ఇంగ్లీష్, తమిళంలో ‘తమిళనాడు’ రాష్ట్రాన్ని రెండు విధాలుగా సంబోధించడం తాాజా వివాదానికి కారణం అయింది. తమిళ ఆహ్వనంలో ‘తమిళగం’ గవర్నర్ (తమిళంలో) అని పేర్కొనగా.. ఇంగ్లీష్ లో తమిళనాడు అని పేర్కొన్నారు. తమిళగం అనేది తమిళనాడు రాష్ట్రాన్ని పిలిచి పురాతన పద్దతి. దీనికి ‘తమిళ ప్రజల భూమి’అని అర్థం.
ఇక గవర్నర్ కేవలం కేంద్ర ప్రభుత్వ చిహ్నాన్ని మాత్రమే ఉపయోగించారని, రాష్ట్ర చిహ్నాన్ని ఉపయోగించలేదని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియన్ (మార్క్సిస్ట్) ఎంపీ సు వెంకటేశన్, తమిళనాడు లోగోను ఎందుకు ఉపయోగించలేదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. అంతకుముందు నీట్ వివాదంలో తమిళనాడు గవర్నర్ రవిపై అక్కడి పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 14,2022న తమిళనాడు గవర్నర్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), దాని మిత్ర పక్షాలు బహిష్కరించాయి. నీట్ వ్యతిరేఖ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ పంపకపోవడంతో నిరసనగా బహిష్కరించాయి.
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!