Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
- కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా అభివర్ణించిన రాహుల్ గాంధి
- వెంటనే తన తప్పును సరిదిద్దుకున్న కాంగ్రెస్ అగ్రనేత
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీరీ పండిట్లను పాకిస్థాన్ శరణార్థులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే.. ఆయన వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుంచి దేశానికి వస్తున్న శరణార్థుల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. జమ్మూలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. “పీఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తామన్నారు. క్షమించండి.. కాశ్మీరీ పండిట్లకు మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానం నెరవేరుతుంది.” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధికి పీఓకే, పాకిస్థాన్ కి మధ్య తేడా తెలియడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
READ MORE: Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఇంకా రాహుల్ మాట్లాడుతూ.. కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కృషి చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు, “భారతదేశ చరిత్రలో మనం జమ్మూ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. మరియు కాశ్మీర్ ఆ రాష్ట్ర హోదాను తీసివేసి, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే, మేము – ‘భారత్’ కూటమి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నాను. దీని కోసం మేము లోక్సభ, రాజ్యసభలలో మా పూర్తి బలాన్ని ఉపయోగిస్తాం. ” అని రాహుల్ గాంధీ అన్నారు.
READ MORE:Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు
లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నంత కాలం బయటి వ్యక్తులు లాభపడతారని, స్థానిక ప్రజలు విస్మరించబడుతూనే ఉంటారని రాహుల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుండి రాష్ట్ర హోదాను లాక్కోవడానికి ఇదే కారణమని.. వారు జమ్మూ కాశ్మీర్ను పరిపాలించాలని బయటి వ్యక్తులను కోరుకుంటున్నారన్నారు.
PoK Will Be Part Of India – MODI govt
Whereas Rahul Gandhi is still confused between POK refugees and Kashmiri pandits
Accidental LOP 🤣🤣🤣 pic.twitter.com/OANqmMu9nu
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 25, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!