Karumuri Nageswara Rao: ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు!
- తణుకులో జనసేన కార్యకర్తల భారీ ర్యాలీ
- అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం
- కారుమూరి కాన్వాయిని చ్చుట్టుముట్టిన జనసేన కార్యకర్తలు
- ఘటనపై పోలీస్ స్టేషన్లో కారుమూరి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires on Jana Sena Workers Over HHVM Rally: జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారని, ఆయన బొమ్మపై కాలుతో ఎందుకు తన్నారని ప్రశ్నించారు. తమ పార్టీ మీద, తన మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని మాజీ మంత్రి కారుమూరి అడిగారు.
హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. ప్రచార రథంపై ఎక్కి జనసేన జెండాలు ఊపుతూ చాలా సమయం వీరంగం సృష్టించారు. జనసేన కార్యకర్తలు ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రచార రథం వెనుక కారులో కారుమూరి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కారుమూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో కారుమూరి స్పదించారు.
Also Read
‘నిన్న జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. ఇది దుర్మార్గమైన, హేయమైన పని. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏం తప్పు చేశారు, ఆయన బొమ్మపై కాలుతో తన్నారు. నాకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమ పథకాలు ఇవ్వమన్న నాయకుడు జగన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీలో షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే వారి నాయకులను సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నారు. 15 సంవత్సరాలు టీడీపీ పల్లకి మోస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. మా పార్టీ మీద, నా మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని అడుగుతున్నా?. నిన్న జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము’ అని కారుమూరి చెప్పారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!