Karumuri Nageswara Rao: ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు!
- తణుకులో జనసేన కార్యకర్తల భారీ ర్యాలీ
- అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం
- కారుమూరి కాన్వాయిని చ్చుట్టుముట్టిన జనసేన కార్యకర్తలు
- ఘటనపై పోలీస్ స్టేషన్లో కారుమూరి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires on Jana Sena Workers Over HHVM Rally: జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారని, ఆయన బొమ్మపై కాలుతో ఎందుకు తన్నారని ప్రశ్నించారు. తమ పార్టీ మీద, తన మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని మాజీ మంత్రి కారుమూరి అడిగారు.
హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. ప్రచార రథంపై ఎక్కి జనసేన జెండాలు ఊపుతూ చాలా సమయం వీరంగం సృష్టించారు. జనసేన కార్యకర్తలు ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రచార రథం వెనుక కారులో కారుమూరి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కారుమూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో కారుమూరి స్పదించారు.
Also Read
‘నిన్న జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. ఇది దుర్మార్గమైన, హేయమైన పని. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏం తప్పు చేశారు, ఆయన బొమ్మపై కాలుతో తన్నారు. నాకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమ పథకాలు ఇవ్వమన్న నాయకుడు జగన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీలో షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే వారి నాయకులను సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నారు. 15 సంవత్సరాలు టీడీపీ పల్లకి మోస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. మా పార్టీ మీద, నా మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని అడుగుతున్నా?. నిన్న జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము’ అని కారుమూరి చెప్పారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?