Karumuri Nageswara Rao: ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు!
- తణుకులో జనసేన కార్యకర్తల భారీ ర్యాలీ
- అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం
- కారుమూరి కాన్వాయిని చ్చుట్టుముట్టిన జనసేన కార్యకర్తలు
- ఘటనపై పోలీస్ స్టేషన్లో కారుమూరి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires on Jana Sena Workers Over HHVM Rally: జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారని, ఆయన బొమ్మపై కాలుతో ఎందుకు తన్నారని ప్రశ్నించారు. తమ పార్టీ మీద, తన మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని మాజీ మంత్రి కారుమూరి అడిగారు.
హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. ప్రచార రథంపై ఎక్కి జనసేన జెండాలు ఊపుతూ చాలా సమయం వీరంగం సృష్టించారు. జనసేన కార్యకర్తలు ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రచార రథం వెనుక కారులో కారుమూరి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కారుమూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో కారుమూరి స్పదించారు.
Also Read
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
‘నిన్న జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. ఇది దుర్మార్గమైన, హేయమైన పని. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏం తప్పు చేశారు, ఆయన బొమ్మపై కాలుతో తన్నారు. నాకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమ పథకాలు ఇవ్వమన్న నాయకుడు జగన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీలో షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే వారి నాయకులను సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నారు. 15 సంవత్సరాలు టీడీపీ పల్లకి మోస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. మా పార్టీ మీద, నా మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని అడుగుతున్నా?. నిన్న జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము’ అని కారుమూరి చెప్పారు.
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!