Karumuri Nageswara Rao: ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు!
- తణుకులో జనసేన కార్యకర్తల భారీ ర్యాలీ
- అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం
- కారుమూరి కాన్వాయిని చ్చుట్టుముట్టిన జనసేన కార్యకర్తలు
- ఘటనపై పోలీస్ స్టేషన్లో కారుమూరి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires on Jana Sena Workers Over HHVM Rally: జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారని, ఆయన బొమ్మపై కాలుతో ఎందుకు తన్నారని ప్రశ్నించారు. తమ పార్టీ మీద, తన మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని మాజీ మంత్రి కారుమూరి అడిగారు.
హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. ప్రచార రథంపై ఎక్కి జనసేన జెండాలు ఊపుతూ చాలా సమయం వీరంగం సృష్టించారు. జనసేన కార్యకర్తలు ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రచార రథం వెనుక కారులో కారుమూరి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కారుమూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో కారుమూరి స్పదించారు.
Also Read
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
‘నిన్న జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. ఇది దుర్మార్గమైన, హేయమైన పని. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏం తప్పు చేశారు, ఆయన బొమ్మపై కాలుతో తన్నారు. నాకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమ పథకాలు ఇవ్వమన్న నాయకుడు జగన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీలో షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే వారి నాయకులను సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నారు. 15 సంవత్సరాలు టీడీపీ పల్లకి మోస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. మా పార్టీ మీద, నా మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని అడుగుతున్నా?. నిన్న జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము’ అని కారుమూరి చెప్పారు.
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!