Karnataka: మాజీ సీఎంకు ఆస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Former CM HD Kumaraswamy Admitted in Hospital: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ ముఖ్య నేత హెచ్డీ. కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను బుధవారం బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. హెచ్డీ కుమారస్వామి బుధవారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలోని రైతుల భూములను సందర్శించాల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిండంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కుమార స్వామి ఆసుపత్రి పాలవడంతో ఇవాళ కోలార్ లో రైతులతో జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే జేడీఎస్ పార్టీ కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించారు కుమార స్వామి. దీంతో ఆయన అలసిపోయినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కూడా అలసట, జ్వరం కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. చాలా మంది ఆసుపత్రికి చేరకొని ఆయనను పరామర్శిస్తున్నారు. ఇక అనారోగ్యం
Also Read: Rice Export: ఆ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అనేకమంది తమ పార్టీలో చేరబోతున్నారంటూ పదేపదే చెబుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు తమ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకోవాలనే టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ రెండు పార్టీలు కర్ణాటకలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!