Bribe: లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.. ఇంట్లో రూ.6కోట్లు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka BJP MLA’s Son Caught Taking Bribe: ఒక రోజు క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత సుమారు రూ. 6 కోట్ల విలువైన నగదు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం ఈ నగదును దాచినట్లు అధికారులు గుర్తించారు. లోకాయుక్త అవినీతి నిరోధక విభాగం, రాష్ట్ర అంబుడ్స్మెన్ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంటిపై దాడి చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. దావణగెరె జిల్లాలోని చన్నగిరికి చెందిన ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప, ప్రసిద్ధ మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కెఎస్డిఎల్)కి చైర్మన్. అతని కుమారుడు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్గా ఉన్నారు. కేఎస్డీఎల్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ను లోకాయుక్త అవినీతి నిరోధక శాఖ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో రూ. 1.75 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. మూడు బ్యాగుల్లోని నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Credit Card Fraud: హైటెక్ మోసం.. ధోనీ, అభిషేక్ బచ్చన్ సహా ప్రముఖుల పాన్ వివరాలతో..
Also Read
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Ruchika Singh: "నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి".. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
2008 బ్యాచ్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి ప్రశాంత్ మాదాల్, సబ్బు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల ఒప్పందం కోసం ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 81 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు అందిందని అంబుడ్స్మన్ తెలిపారు. అంబుడ్స్మన్ స్వతంత్ర దర్యాప్తు జరుపుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్పై కూడా విరుచుకుపడ్డారు. ‘అవినీతిని అరికట్టేందుకు లోకాయుక్తను తిరిగి ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ హయాంలో లోకాయుక్త రద్దుతో చాలా కేసులు మూతపడ్డాయి. మూతపడిన కేసులపై విచారణ జరిపిస్తాం. లోకాయుక్త స్వతంత్ర సంస్థ, మా స్టాండ్ స్పష్టంగా ఉంది. స్వతంత్రంగా దర్యాప్తు చేసి అందులో జోక్యం చేసుకోబోం’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Jr NTR : ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
-
Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
-
MG Hector Plus Diesel: ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే
-
Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
-
Ruchika Singh: “నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”.. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!