Bribe: లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.. ఇంట్లో రూ.6కోట్లు లభ్యం
Karnataka BJP MLA’s Son Caught Taking Bribe: ఒక రోజు క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత సుమారు రూ. 6 కోట్ల విలువైన నగదు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం ఈ నగదును దాచినట్లు అధికారులు గుర్తించారు. లోకాయుక్త అవినీతి నిరోధక విభాగం, రాష్ట్ర అంబుడ్స్మెన్ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంటిపై దాడి చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. దావణగెరె జిల్లాలోని చన్నగిరికి చెందిన ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప, ప్రసిద్ధ మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కెఎస్డిఎల్)కి చైర్మన్. అతని కుమారుడు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్గా ఉన్నారు. కేఎస్డీఎల్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ను లోకాయుక్త అవినీతి నిరోధక శాఖ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో రూ. 1.75 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. మూడు బ్యాగుల్లోని నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Credit Card Fraud: హైటెక్ మోసం.. ధోనీ, అభిషేక్ బచ్చన్ సహా ప్రముఖుల పాన్ వివరాలతో..
Also Read
- Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
2008 బ్యాచ్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి ప్రశాంత్ మాదాల్, సబ్బు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల ఒప్పందం కోసం ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 81 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు అందిందని అంబుడ్స్మన్ తెలిపారు. అంబుడ్స్మన్ స్వతంత్ర దర్యాప్తు జరుపుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్పై కూడా విరుచుకుపడ్డారు. ‘అవినీతిని అరికట్టేందుకు లోకాయుక్తను తిరిగి ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ హయాంలో లోకాయుక్త రద్దుతో చాలా కేసులు మూతపడ్డాయి. మూతపడిన కేసులపై విచారణ జరిపిస్తాం. లోకాయుక్త స్వతంత్ర సంస్థ, మా స్టాండ్ స్పష్టంగా ఉంది. స్వతంత్రంగా దర్యాప్తు చేసి అందులో జోక్యం చేసుకోబోం’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
-
Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
-
Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?
-
MS Dhoni: “ధోనీ ఎక్కడ?”.. కనీసం డగౌట్లోనూ కనిపించని మిస్టర్ కూల్.. అసలు గుట్టు విప్పిన కోచ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!