Emergency movie: కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ ఎప్పుడంటే?
- కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకు గ్రీన్ సిగ్నల్
- గతంలో సినిమాపై సిక్కులు అభ్యంతరం
- తాజాగా సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్
- ఎక్స్ పోస్ట్లో తెలిపిన నటి కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది. అయితే ఇప్పుడు విడుదలకు చిక్కుముళ్లు వీడాయి. తాజాగా తన సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొందిందని నటి తెలియజేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను పంచుకుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. మీ సహనం, మద్దతుకు కృతజ్ఞురాలినని పోస్ట్లో పేర్కొంది.
READ MORE: Bhakthi TV Koti Deepotsavam 2024 : భక్తి టీవీ కోటి దీపోత్సవం.. నవంబర్ 9 నుంచి 25 వరకు..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఎమర్జెన్సీపై వివాదం ఏమిటి?
కంగనా చిత్రం ముందుగా 2024 సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. అయితే సిక్కు సంస్థల నిరసనలతో విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో తమ సమాజం గురించి తప్పుగా చూయించారని.. సిక్కులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 14న విడుదలైంది. అప్పటి నుంచి సినిమాపై వివాదం తలెత్తింది. పంజాబ్లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు. సీబీఎఫ్సీ ఇంతకుముందు సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ సిక్కు సంఘం యొక్క ఆగ్రహం తెరపైకి రావడంతో ఈ వివాదం.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మేకర్స్కు ఇంకా సర్టిఫికేట్ నిలిపేసింది. సర్టిఫికేట్ ఇచ్చే ముందు సిక్కుల అభ్యంతరాలపై దృష్టి పెట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్సీని ఆదేశించింది.
కంగనా సినిమాలో మార్పులు..
సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో మేకర్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్సీ రివైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది చిత్రంలో కంగనాకు మార్పులను సూచించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పాస్ కావడానికి షరతులు పెట్టినట్లు సమాచారం. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో మార్పులు చేయాలని మేకర్స్ని ఆదేశించారు. చారిత్రక అంశాలపై డిస్క్లైమర్లు పెట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఎమర్జెన్సీ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. నటనతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి వంటి పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!