Emergency movie: కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ ఎప్పుడంటే?
- కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకు గ్రీన్ సిగ్నల్
- గతంలో సినిమాపై సిక్కులు అభ్యంతరం
- తాజాగా సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్
- ఎక్స్ పోస్ట్లో తెలిపిన నటి కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది. అయితే ఇప్పుడు విడుదలకు చిక్కుముళ్లు వీడాయి. తాజాగా తన సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొందిందని నటి తెలియజేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను పంచుకుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. మీ సహనం, మద్దతుకు కృతజ్ఞురాలినని పోస్ట్లో పేర్కొంది.
READ MORE: Bhakthi TV Koti Deepotsavam 2024 : భక్తి టీవీ కోటి దీపోత్సవం.. నవంబర్ 9 నుంచి 25 వరకు..
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
ఎమర్జెన్సీపై వివాదం ఏమిటి?
కంగనా చిత్రం ముందుగా 2024 సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. అయితే సిక్కు సంస్థల నిరసనలతో విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో తమ సమాజం గురించి తప్పుగా చూయించారని.. సిక్కులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 14న విడుదలైంది. అప్పటి నుంచి సినిమాపై వివాదం తలెత్తింది. పంజాబ్లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు. సీబీఎఫ్సీ ఇంతకుముందు సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ సిక్కు సంఘం యొక్క ఆగ్రహం తెరపైకి రావడంతో ఈ వివాదం.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మేకర్స్కు ఇంకా సర్టిఫికేట్ నిలిపేసింది. సర్టిఫికేట్ ఇచ్చే ముందు సిక్కుల అభ్యంతరాలపై దృష్టి పెట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్సీని ఆదేశించింది.
కంగనా సినిమాలో మార్పులు..
సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో మేకర్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్సీ రివైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది చిత్రంలో కంగనాకు మార్పులను సూచించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పాస్ కావడానికి షరతులు పెట్టినట్లు సమాచారం. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో మార్పులు చేయాలని మేకర్స్ని ఆదేశించారు. చారిత్రక అంశాలపై డిస్క్లైమర్లు పెట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఎమర్జెన్సీ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. నటనతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి వంటి పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!