Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ని అప్పగించాలని కోరాం..
- ఇంత వరకు కెనడా నుంచి స్పందన రాలేదన్న కేంద్రం..
- కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యల తర్వాత స్పందించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lawrence Bishnoi: కెనడా, ఇండియాల మధ్య దౌత్య ఉద్రిక్తలు పెరిగాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని గతేడాది ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్యూడో ఆరోపించాడు. దీనిని అసంబద్ధ వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో కెనడాలోని భారత రాయబారులకు సంబంధం ఉందని ముఖ్యంగా, భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో సహా ఆరుగురి ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్ ఫైర్ అయింది. కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు భారత్ లోని కెనడా రాయబారుల్ని మీ దేశానికి వెళ్లాలని ఆదేశించింది.
ఇదే కాకుండా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వివరాలను ఈ రాయబారులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కి పంపిస్తున్నారంటూ అక్కడి పోలీసులు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కెనడా పీఎం ట్రూడో కూడా నిజ్జర్ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపించాడు. అయితే, కెనడా ఆరోపణలపై భారత్ ప్రతీసారి సాక్ష్యాలు సమర్పించాలని కోరినా.. కెనడా ఈ పని చేయలేదు. తాజాగా ట్రూడో తమ వద్ద గట్టి సాక్ష్యాలు లేవని ఒప్పుకున్నాడు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
అయితే, గతంలో కెనడాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల్ని తమకు అప్పగించాలని కొన్నేళ్ల క్రితం భారత్ కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్న సిండికేట్ సభ్యుల్ని తమకు అప్పటించాలని భారత్ కెనడాని కోరిందని.. కెనడా ఇంకా స్పందించలేదని అన్నారు. గుర్జిత్ సింగ్, గుర్జీందర్ సింగ్, అర్ష్దీప్ సింగ్ గిల్, లఖ్బీర్ సింగ్ లాండా, గుర్ప్రీత్ సింగ్ పేర్లను విదేశాంగమంత్రిత్వ శాఖ కెనడాకు ఇచ్చిందని, వీరిలో బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కూడా ఉన్నారని చెప్పింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను పంచుకోలేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. భారత వ్యతిరేక, వేర్పాటువాద అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు కెనడా తన ‘‘వాక్ స్వాతంత్ర్యాన్ని’’ ముందకు తీసుకువస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లారెన్స్ బిష్ణోయ్ పేరుని వెల్లడించిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది.
తాజావార్తలు
-
Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
-
Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
-
Astrology: జూలై 11 శనివారం దినఫలాలు..
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!