Kadiyam Srihari: బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా?.. ఈ బుద్ది అప్పుడు ఏమైంది?
- బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే కడియం ఫైర్
- వారికి ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా?
- నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో పనిచేస్తున్నా
- తప్పకుండా స్పీకర్కి సమాధానం ఇస్తాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని గుర్తు చేశారు. అప్పటి వారెవరూ రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని విమర్శించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, ఈ బుద్ది అప్పుడు ఏమైంది? అని కడియం ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా హనుమకొండలోని హరిత హోటల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు తనకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. ‘స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా. కాంగ్రెస్తో కలిసి పని చేయడంతోనే మనకు ఇన్ని నిధులు వచ్చాయి. నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంది అంటే.. మొత్తంలో నిధులు తేవడమే కారణం. నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండాయి. కాలువల్లో పూడిక తీయించి మరమ్మతులు చేసి సాగునీరు అందిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సహకారం వల్లే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ప్రగతికి సీఎం అన్ని విధాలుగా అండగా ఉన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తెచ్చిన నిధులపైన నేను కట్టుబడి ఉన్నా’ అని కడియం తెలిపారు.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
Also Read: Ponguleti Biopic: ‘శ్రీనన్న అందరివాడు’.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
‘స్టేషన్ ఘన్పూర్ ప్రజలతోనే ఉంటా, ప్రజల కోసమే నిరంతరం కష్టపడతా. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇద్దరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అప్పుడు టీఆర్ఎస్లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదు. మీరు చేర్చుకున్నపుడు ఒక విధానం, వేరే వారు చేర్చుకున్నప్పు ఇంకో విధానంను బీఆర్ఎస్ పాటిస్తుంది. బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇప్పుడు విలువలు గుర్తుకొచ్చాయా?. స్పీకర్కి కోర్టు సూచన చేసింది కానీ.. ఆదేశాలు జారీ చేయలేదు. స్పీకర్కి నేను సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం ఉంది. ఒక్కొక్కరి కొంత సమయం ఇచ్చారు, తప్పకుండా స్పీకర్కి సమాధానం ఇస్తాను. నేను పార్టీ మారి పదవి అనుభవించలేదు, నా పని తిరుతోనే పదవి వచ్చింది’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..