KA Paul: అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్..! చంద్రబాబుతో రూ.1,500 కోట్ల డీల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: మెగా బ్రదర్స్పై సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో పర్యటించిన ఆయన.. బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు.. వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో ఉండకూడదన్నారు. ప్యాకేజీ స్టార్ (పవన్ కల్యాణ్) కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు.. దీంతో, కాపులను టీడీపీకి అమ్మేశారని పేర్కొన్నారు. 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్.. కాపులను అమ్మేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Congress Manifesto: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో.. విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ఇక, రాజ్యాధికారం కోసం కాపులంతా తరలి రావాలి అంటూ పిలుపునిచ్చారు కేఏ పాల్.. 29 శాతం ఉన్న కాపులకు అధికారం రావాలని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వెనుక ఉంటారా? నాతో ఉంటారా? కాపులు తెల్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 30 సీట్లకు 1,500 కోట్ల రూపాయలకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడు అని విమర్శించారు. గుండు గీయించుకున్న కాపులు కావాలా..? గుండు గీసే కాపులు కావాలా..? తేల్చుకోవాలన్నారు. మరోవైపు.. మీ నాన్న (వంగవీటి రంగా)ను చంపిన వారితో ఉంటారా? నాతో ఉంటారో వంగవీటి రాధా తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. కాగా, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు కేఏ పాల్.. తెలంగాణలో కొన్నిసార్లు.. ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొన్నిసార్లు ప్రత్యక్షమై.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంటారు.. గతంలో మునుగోడు ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ఆయన.. ఘోర పరాజయాన్ని ముఠగట్టుకున్న విషయం విదితమే. గతంలో, పవన్ కల్యాణ్ ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరిన ఆయన.. ఆ తర్వాత పవన్ కల్యాణ్పై ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!