Justice NV Ramana: ఆర్థిక పరిస్థితిని గమనించి ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice NV Ramana: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా, అప్పటి గాయాలు చాలా మందిని ఇంకా వెంటాడుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొవిడ్ వచ్చినప్పుడు చాలా మంది బతకాలనే ఆశతో ఆస్తులను అమ్మి వైద్యం చేయించుకున్నారని, కానీ ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఇంకా ఎందుకు బతికున్నామా అని ఇప్పుడు కుమిలిపోతున్నారని ఆయన అన్నారు. ప్రాణం మీదకొస్తే తల తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడతారని, అలాంటి వారి ఆర్థిక పరిస్థితిని గమనించి ఆసుపత్రుల్లో వైద్యం అందించాలని వైద్యులకు జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం బేగంపేటలోని హోటల్ మారిగోల్డ్లో ‘డయాబెటిస్ అండ్ యూ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై.. వైద్యరంగంలో ఉత్తమ సేవలందించిన పలువురు వైద్యులకు ఆయన అవార్డులను అందజేశారు.
Read Also: Indian Army: ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం కొత్త బోర్డులు.. అధికారుల కొరతకు చెక్!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఈ కాలంలో జనాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల గురించి ఆయన మాట్లాడారు. దేశాన్ని జీవనశైలి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని, దేశంలో 1.25 కోట్ల మంది చిన్నారులు, 4.40 కోట్ల మంది మహిళలు ఊబకాయంసమస్యతో బాధపడుతున్నారని ఇటీవల ఓ ఆసుపత్రి నిర్వహించిన సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. అల్లోపతి లాంటి ఆధునిక వైద్య విధానాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఎంతోమంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలను ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. దేశంలో కొంత మంది వైద్యులు సమాజం కోసం కృషి చేస్తున్నారని.. నగరానికి చెందిన వైద్యురాలు షీలా భోలే ఇదే కోవకు చెందుతారని అన్నారు. 88 ఏళ్ల వయసులోనూ వయోభారాన్ని లెక్క చేయకుండా ఇప్పటికీ స్వచ్ఛందంగా వైద్య సేవలందిస్తున్నారని ప్రశంసించారు. “డయాబెటిస్ అండ్ యూ(డీఏవై’) సొసైటీ” వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వసంత్ కుమార్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని, ఎంతోమంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారని కొనియాడారు.
సమాజాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దే వైద్యులు బాధ్యతాయుతంగా సేవలందించాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా.. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేలు తలపెట్టవోయ్.. తిండి కలిగితే కండ కలదోయ్.. కండ గలవాడే మనిషోయ్..’ అన్న మహాకవి గురజాడ మాటలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..