Priyanka Gandhi: అగ్రనేతలు కోరితే రాజీనామా చేస్తానన్న బ్రిజ్భూషణ్.. ప్రధానికి ట్యాగ్ చేసిన ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పార్టీ అగ్రనేతలు కోరితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ, అమిత్ షా లేదా జేపీ నడ్డాతో సహా బీజేపీ అగ్రనేతలు ఎవరైనా తనను వైదొలగాలని కోరితే తాను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా పదవీ విరమణ చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. దీనిని షేర్ చేస్తూ.. ప్రియాంక ప్రధానిని ట్యాగ్ చేశారు. ‘నరేంద్రమోదీ మరి ఆయన్ను అడగండి. అవును అని మీరు ఇచ్చే సమాధానం కోసం న్యాయం ఎదురుచూస్తోంది’ అని ఆమె పోస్టు పెట్టారు.
Read Also: Brij Bhushan Sharan Singh: నన్ను ఉరితీయండి కానీ కుస్తీని ఆపొద్దు.. బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఏప్రిల్ 29న ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఒక మైనర్తో సహా భారత అగ్రశ్రేణి రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేసి సమాఖ్య నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. అందులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం వారిని కలిసి ఓదార్చారు. ప్రభుత్వం వీరి ఆవేదనను వినకుండా బ్రిజ్భూషణ్ను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న బీజేపీ ఎంపీపై రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్లు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపాదించినప్పటికీ, నిరసన తెలిపిన రెజ్లర్లు బీజేపీ ఎంపీని అరెస్టు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..