Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
- నేడు జనసేన పార్టీ కీలక సమావేశం
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ సమావేశం
- పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
అదేవిధంగా ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అంశంపైనా సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ పనితీరును మెరుగుపరచడం, స్థానిక స్థాయిలో పార్టీ చురుకుదనాన్ని పెంచడం లక్ష్యంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను కట్టుదిట్టం చేసేందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి), క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది.
Also Read
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
Also Read: IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
ప్రస్తుతం జనసేన పార్టీకి సుమారు 15 లక్షల మంది సభ్యత్వం ఉన్నట్లు సమాచారం. నేటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా.. దాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించే యోచనలో జనసేన పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మరింత మంది సభ్యులను ఆకర్షించాలని నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ సమావేశం జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కీలకంగా మారనుంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశను నిర్ణయించనున్నాయి.
తాజావార్తలు
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!