Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ
- నేడు జనసేన పార్టీ కీలక సమావేశం
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ సమావేశం
- పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
అదేవిధంగా ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అంశంపైనా సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ పనితీరును మెరుగుపరచడం, స్థానిక స్థాయిలో పార్టీ చురుకుదనాన్ని పెంచడం లక్ష్యంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను కట్టుదిట్టం చేసేందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి), క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Also Read: IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
ప్రస్తుతం జనసేన పార్టీకి సుమారు 15 లక్షల మంది సభ్యత్వం ఉన్నట్లు సమాచారం. నేటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా.. దాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించే యోచనలో జనసేన పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మరింత మంది సభ్యులను ఆకర్షించాలని నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ సమావేశం జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కీలకంగా మారనుంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశను నిర్ణయించనున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!