‘జనసేన’ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన అజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం…