Israel-Iran: ఇజ్రాయెల్తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి
- ఇజ్రాయెల్తో స్నేహం వద్దు
- ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా టార్గెట్గా లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తోంది. శత్రువులతో చేతులు కలిపే దేశాలపై ఇజ్రాయెల్ దూకుడుగా పోతోంది. ఇప్పటికే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆయా దేశాలు తమ పౌరులు లెబనాన్ను విడిచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చాయి.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్!
Also Read
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
తాజాగా ముస్లిం దేశాలకు ఇరాన్ కీలక విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోవాలని సూచించింది. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జాదేహ్ మాట్లాడారు. ముస్లిం దేశాలు.. ఇజ్రాయెల్తో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకోవాలని కోరింది. ఆ దేశ దౌత్యవేత్తలను బహిష్కరించాలని తెలిపింది. అలాగే నెతన్యాహు ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ ముందు లొంగిపోవద్దని యెమెన్కు చెందిన హూతీ చీఫ్ అబ్దుల్ మాలిక్ కూడా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Amrapali Kata : గ్రేటర్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ GHMC కమిషనర్ నిర్ణయం
ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. లెబనాన్పై పూర్తిశక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హిజ్బుల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్ను ఖాళీ చేసిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లడమే తమ లక్ష్యమని నెతన్యాహు తెలిపారు. హిజ్బుల్లా ఆయుధాలను ధ్వంసం చేసే వరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Tiger Robi: భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. బంగ్లా అభిమానిపై దాడి..!
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?