Jagga Reddy: సీఎం గారూ.. మా లేఖలను కూడా ఆమోదించండి!
- సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు
- సీఎం చంద్రబాబుకి జగ్గారెడ్డి అభినందనలు
- ఈరోజు తాను లేఖ రాస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై తిరుమలలో దర్శనంకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు తెలిపారు. అలానే తెలంగాణలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖలను కూడా ఆమోదించాలని ఏపీ సీఎంను కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మీడియా ద్వారా మనవి చేశారు. ఈరోజు తాను లేఖ రాస్తా అని, అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కూడా లేఖ రాయమని విజ్ఞప్తి చేస్తా అని జగ్గారెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఏపీ సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
Also Read: Magnus Carlsen: విశ్వనాథన్ ఆనంద్ అనర్హుడు.. కార్ల్సన్ తీవ్ర విమర్శలు!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నుంచి ప్రతివారం రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కోసం రెండు లేఖలు, రూ.300/- టికెట్పై ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలు తిరుమలలో అనుమతిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో లేఖతో ఆరుగురు భక్తులను దర్శనానికి సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆమోదించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!