Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Jagan Mohan Reddy Says Mafias Ruling Andhra Pradesh And Public Wealth Being Looted

Jagan Mohan Reddy: రాష్ట్రంలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయి..!

NTV Telugu Twitter
Published Date :May 22, 2025 , 12:39 pm
By Kothuru Ram Kumar
Jagan Mohan Reddy: రాష్ట్రంలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, అవినీతి, అమరావతిలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా వంటి అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. తమ హయాంలో వర్షాకాలం కోసం 80 వేల టన్నుల ఇసుక నిల్వ చేసినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండు నెలల్లోనే మొత్తం ఇసుకను ఊడ్చేశారని తెలిపారు.

Read Also: Jagan Mohan Reddy: రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!

అలాగే, అమరావతిలో జరిగిన అవకతవకలపై జగన్ ఆరోపణలు గుప్పించారు. గతంలో పూర్తయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి.. మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. దీనికోసం జ్యుడీషియల్ ప్రివ్యూను తొలగించారని, రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసి మొబలైజేషన్ అడ్వాన్సులు మళ్లీ తీసుకొచ్చారని తెలిపారు. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ కాంప్లెక్స్‌లు కలిపి 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు ఉన్నా, కొత్తగా 53 లక్షల చదరపు అడుగులు నిర్మించాలనుకుంటుండటాన్ని జగన్ ప్రశ్నించారు. ఈ నిర్మాణాలు అవసరమేనా అని అడుగుతూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క కిలోమీటర్ రోడ్ నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తుండడంపై కూడా విమర్శలు చేశారు.

Read Also: Jagan Mohan Reddy: అభివృద్ధి ఎక్కడ కనిపించనేలేదు.. సంక్షేమం ఊసే లేదు..!

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారం పెంచుతున్నారని జగన్ తెలిపారు. ఇప్పటికే అమరావతి కోసం రూ.52 వేల కోట్ల అప్పులు చేశారని, మొత్తం 77 వేల కోట్లు కావాలని ఫైనాన్స్ కమిషన్‌కు వివరించారని చెప్పారు. ప్రజలపై వేస్తున్న ఈ భారం తీవ్రంగా కలవరపెడుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ ఎలాంటి కొత్త పధకాలు అమలు కాలేదని ఆయన అన్నారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో అమలైన రైతు భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య బీమా వంటి పథకాలు నిలిపివేయబడ్డాయని విమర్శించారు. ప్రజలకు నష్టమే తప్ప లాభం ఏమీ కనిపించడంలేదన్నారు.

అలాగే రాష్ట్రంలోని లిక్కర్ స్కాం ఆరోపణలపై జగన్ స్పష్టత ఇచ్చారు. తమ హయాంలో మద్యం విక్రయాలు తగ్గి, ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు. 2023–24లో రూ.25,082 కోట్లు ఆదాయం వచ్చిందని, టీడీపీ హయంలో అదే ఆదాయం కేవలం రూ.2,623 కోట్లు మాత్రమేనని తెలిపారు. మద్యం షాపులు ప్రభుత్వమే నడిపితే లంచాల ప్రశ్నే లేదని, టీడీపీ హయంలో ప్రైవేటు మాఫియా చేతిలో వ్యాపారం జరిగిందని విమర్శించారు. మొత్తంగా వాస్తవాలను ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నామని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ఇది దోపిడీ పాలన, అప్పుల పాలన, మాఫియా పాలనగా ముద్రవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati Construction
  • Amaravati scam
  • Andhra Pradesh Politics
  • Chandrababu Naidu
  • Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Kubear Pre Release Event : నాకు, శేఖర్ కమ్ములకు తేడా అదే.. రాజమౌళి కామెంట్స్..

  • Kubera Trailer : కుబేర ట్రైలర్ వచ్చేసింది..

  • Donald Trump: ‘‘నేను భారత్-పాకిస్తాన్‌కు చేసినట్లే..’’ ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందం..

  • Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు రానందుకేనా..?

  • Nirmal: బాసరలో విషాదం.. పుణ్య క్షేత్రంలో స్నానానికి వెళ్ళి ఐదుగురు మృత్యువాత

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions