Jagadish Reddy : చివరి ప్రాంతాలకు గోదావరి నీళ్లను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 300 మందికి బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గతంలో 10వేల రూపాయలు సహాయం కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. ఒక్కసారి లబ్ధిపొందిన మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చేవి కాదని, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి పారుతున్న సాగునీరును ఆంధ్రప్రాంతానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది అని ఆయన విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ డ్యామ్ కటింది తెలంగాణ ప్రజలు.. ఎక్కడో ఉన్న ఆంధ్ర వాళ్ళు వచ్చి నీళ్లు తీసుకెళ్లారని, చివరి ప్రాంతాలకు గోదావరి నీళ్లను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది అని ఆయన కొనియాడారు.
Also Read : MLA Katasani Rambhupal Reddy: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
నాగార్జున సాగర్ ఎడమ కాలువ కు సైతం గోదావరి నీళ్లు అందిస్తామని ఆయన వెల్లడించారు. రైతుల పక్షపాతి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. 14 కులాలకు కులవృత్తుల అందించాలనే సంకల్పంతో కులవృత్తులలో భాగంగా ఆర్థిక సహాయం అందిస్తుందని, 2018 మల్లయ్య యాదవ్ గెలవడం వల్లనే అభివృద్ధి జరుగుతుందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్ళీ ఘనవిజయం సాధించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలులో రాష్ట్రం చాలా ముందుందని చెప్పారు. మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్తో ఆడబిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూ.. కళ్యాణలక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లి ఖర్చులు చూసుకుంటూ కుటుంబ పెద్దగా నిలిచారన్నారు.
Also Read : Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!