Uttam Kumar Reddy: మహేశ్వర్ రెడ్డి.. కనీస అవగాహన లేకుండా మాట్లాడొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. “నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వంద రోజుల పాలనలో తెలంగాణ లో అద్భుతమైన పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలన ను ఒక గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. మేము వంద రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూ టాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గం..నేను ప్రస్తుతం కుటుంబం తో దైవదర్శనం చేసుకివడానికి వేరే రాష్ట్రానికి వచ్చాము.. రేపు సాయంత్రం హైదరాబాద్ కు వస్తాం. వచ్చాక మహేశ్వర్ రెడ్డి చేసిన అన్ని రాజకీయ ఆరోపణలకు తగిన జవాబు చెప్తాను.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
READ MORE: US: జార్జియాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
కాగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో సీఎం, మంత్రులు వసూల్లకు పాల్పడుతున్నారంటూ లోక్ సభ ఎన్నికల ప్రచార వేళ ప్రధాని మోడీ సహా.. బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. కొత్తగా రాష్ట్రంలో మరో ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ కీలక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. రైతుల ధాన్యం కొనుగోలు రచ్చ కొనసాగుతున్న వేళ.. క్వింటాకు 10 నుంచి 12 కేజీలు అదనంగా జోకుతూ (తూకం) దోచుకుంటున్నారని బిజెఎల్పీ నేత మహేశ్వరెడ్డి ఆరోపించారు. ఏటా కొనుగోలు అయ్యే కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పోల్చితే దాదాపు 13 వేల మెట్రిక్ టన్నులు దోచుకున్నట్లేనని.. ఇలా వందల కోట్ల రూపాయలు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబుల్లోకి వెళ్లినట్లు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..