Champions Trophy 2025: పాక్ కు టీమిండియా వెళ్లకపోవడమే కరెక్ట్..హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాక్ కు వెళ్లే అవకాశంపై ఆందోళన
- పాక్ లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే
- కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరిన బీసీసీఐ
- తాజా బీసీసీఐ నిర్ణయానికి మద్దతిచ్చిన హర్భజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టర్బనేటర్’గా ప్రసిద్ధి చెందిన మాజీ భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి టీమిండియా పాకిస్థాన్కు వెళ్లే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశాడు.ప్రస్తుతం పాకిస్థాన్లో భద్రతా పరిస్థితి అస్థిరతను భజ్జీ ఉదహరించాడు. పాకిస్థాన్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హర్భజన్ వాదన పూర్తిగా సరైనదని భావిస్తున్నారు. కాగా.. టీమిండియా పాక్ లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ టోర్నమెంట్ కోసం టీమిండియాను పాకిస్థాన్ కు పంపుతామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మే నెలలో చెప్పారు. ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్ లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరనున్నట్లు తెలిపాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాక్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ వ్యాఖ్యలకు హర్భజన్ మద్దతిచ్చారు.
READ MORE: Katrina Kaif: వాట్ ఏ ఫిల్మ్.. విజయ్ సినిమాపై కత్రినా కైఫ్ పొగడ్తలు!
Also Read
మరోవైపు పాకిస్థాన్…. ఈ టోర్నీలో భారత్కు సంబంధించిన అన్ని మ్యాచ్లు లాహోర్లో జరుగుతాయని.. మ్యాచ్ల సమయంలో భారత జట్టు అక్కడే హోటల్లో బస చేస్తుందని పాకిస్థాన్ హామీ ఇచ్చింది. లాహోర్లోని గడ్డాఫీ క్రికెట్ స్టేడియం సమీపంలో 5-స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిని సేకరించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల ప్రకటించింది. ఇప్పటి వరకు బీసీసీఐ మళ్లీ స్పందించలేదు. ఓ మీడియా సంస్థతో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘భారత జట్టు పాకిస్థాన్కు ఎందుకు వెళ్లాలి? పాకిస్థాన్లో భద్రతపై ఆందోళన నెలకొంది. బీసీసీఐ నిర్ణయాన్ని నేను అంగీకరిస్తున్నాను. పాకిస్థాన్ లో భారత్ టీం కు రక్షణ ఉండదు. ప్లేయర్ల కోసం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్.” అని పేర్కొన్నాడు.
READ MORE:PM Modi: పాకిస్థాన్ పై మోడీ ఫైర్..ఉగ్రవాదులకు భారీ హెచ్చరిక
గత ఏడాది కూడా ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఫలితంగా శ్రీలంకలో మ్యాచ్లు జరిగాయి. 2012 నుంచి పాకిస్థాన్ మరియు భారతదేశం ద్వైపాక్షిక సిరీస్లు ఆడలేదు. భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) లేదా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) ఈవెంట్లకు పరిమితం చేసింది.
- Tags
- bcci
- cricket
- Harbhajan Singh
- icc
- india
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!