Chandrayaan-3: చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైన స్పేస్ క్రాఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 మిషన్ కీలకమైన మరో ఆపరేషన్ను సక్సెస్ ఫుల్ గా కాంప్లీట్ చేసింది. మరోమారు స్పేస్క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కిలో మీటర్ల బై 1437 కిలోమీటర్లకు తగ్గించినట్టు ఇస్రో ప్రకటించింది. మూడోసారి చేసిన ఈ ఆపరేషన్తో చంద్రుడి ఉపరితలానికి స్పేస్క్రాఫ్ట్ మరింత దగ్గరికి వెళ్లినట్లు తెలిపింది. చంద్రుడి కక్ష్యకు సమీపాన ఇంధనాన్ని మండించడం ద్వారా తాజా ఆపరేషన్ను పూర్తి చేశామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇస్రోలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తిచేసిందన్నారు. ఫలితంగా స్పేస్క్రాఫ్ట్ కక్ష్య తగ్గిందని తెలిపారు.
Read Also: Mancherial: ప్రతిపక్షాల స్వ’రక్షణ’ కోసమే మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై ఆరోపణలు: బీఆర్ఎస్
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇక, తదుపరి ఆపరేషన్ను ఆగస్టు 14, 2023.. ఉదయం 11:30 నుంచి 12:30 మధ్య నిర్వహించనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆపరేషన్లో స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలానికి మరింతగా చేరువవుతుందని వారు వెల్లడించారు. చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి శాస్త్రవేత్తలు వరుసగా నిర్వహిస్తున్న ఆపరేషన్లు సక్సెస్ అవుతున్నాయి. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి ముందు పలు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాక కూడా క్రమంగా కక్ష్యను తగ్గించుకుంటూ జాబిల్లి దగ్గరకు వెళ్తుంది.
Read Also: Sajjanar: సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో.. ట్వీట్ చేసిన ఎండీ సజ్జనార్
ఈ నేపథ్యంలో ఆగస్టు 23వ తేదీన ఏం జరుగుతుందోనని అందరు వేచి చూస్తున్నారు. ఎందుకంటే మిషన్ అంతిమ లక్ష్యమైన చంద్రుడి దక్షణ ధృవంపై ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు ల్యాండింగ్ అవుతుంది. ఈ ఘట్టం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలుస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతకుముందు అమెరికా, రష్యా, చైనా ఈ జాబితాలో ఉన్నాయి. ఇస్రో సాధించబోయే ఈ మైలురాయి అంతరిక్ష అన్వేషణల్లో భారత్ ఎదుగుదలను చాటిచెప్తుంది.
Read Also: PM Modi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ
కాగా చంద్రయాన్-3 మిషన్ను జులై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగే లక్ష్యం దిశగా ఈ మిషన్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ మిషన్లో అత్యంత కీలకమైనది.. చంద్రుడి కక్ష్యలోకి ఆగస్టు 5న ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించింది. ఇక. ఆగస్టు 23న చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో ప్లాన్ చేస్తుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!