Sajjanar: సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో.. ట్వీట్ చేసిన ఎండీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjanar: సోషల్ మీడియాలో వైరల్ కావడడానికి చాలామంది రకరకాల వీడియోలు చేస్తుంటారు. లైక్ ల కోసం నానా తిప్పలు పడుతుంటారు. కొందరు ఒక బైక్ పై కూర్చుని చేసిన వెకిలి చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా బైక్పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణిస్తారు. అయితే ఇద్దరు పిల్లలతో కలిసి నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. వారు ఇంతకంటే ఎక్కువ చేస్తారు, కానీ మీరు ఎప్పుడైనా ఏడుగురు కలిసి ప్రయాణించడం చూశారా? ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అటువంటి జాతి రత్నాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఏడుగురు యువకులు ఒకే బైక్పై తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also: Thursday Remedies: గురువారం నాడు ఈ నివారణలు చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
ఓ బాలుడు బైక్పై వెళ్తుండగా.. మరొకరు ఎదురుగా ఉన్న పెట్రోల్ ట్యాంక్పై కూర్చున్నారు. బైక్ రైడర్ వెనుక నలుగురు తెలివైన వ్యక్తులు కూర్చున్నారు. వారితో పాటు ఆరుగురు..చివరివాడి భుజాలపై కూర్చొని.. గాలిలో ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సరే.. ఇంత మంది ఒకే బైక్పై వెళ్తున్నారు.. కనీసం మెల్లగా వెళ్లకుండా.. స్పీడ్గా వెళ్తున్నారు. ఇదంతా ఒకటైతే.. వారంతా 18 ఏళ్ల లోపు వారే కనిపించడం మరో విశేషం. అదే దారిలో ప్రయాణిస్తున్న కారులోని ఓ వ్యక్తి ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అది వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు ప్రమాదకరమని సజ్జనార్ రాశారు. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని హెచ్చరించారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదని సూచించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది బైక్లపై వెళ్లడం చట్ట విరుద్ధమని సజ్జనార్ సూచించారు. ఉత్తరప్రదేశ్లోని హపూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దమని సజ్జనార్ ట్విట్ చేశారు.
ఒక్క బైక్పై ఏడుగురు ప్రయాణమా?
ఉత్తరప్రదేశ్లోని హపూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం… pic.twitter.com/O9f6Ll7ekf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 9, 2023
తాజావార్తలు
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!