Israel Hamas War : దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దాడి, 45 మంది పాలస్తీనా పౌరులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తర్వాత మరోసారి యుద్ధం మొదలైంది. ఇంతలో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై దాడి చేసింది. 45 మంది మరణించారు.. అనేకమంది గాయపడ్డారు. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటివరకు ఇరువైపులా 16 వేల మందికి పైగా మరణించారు. కాల్పుల విరమణ తర్వాత, దక్షిణ గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన దాడి. ఇజ్రాయెల్ దళాలు జబాలియా, తూర్పు షుజయ్య, ఖాన్ యూనిస్లోకి ప్రవేశించాయని ఆయన చెప్పారు. కాగా మా యోధులు 24 ఇజ్రాయెల్ సైనిక వాహనాలను ధ్వంసం చేశారని హమాస్ పేర్కొంది. దీనితో పాటు స్నిపర్లు ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దీని కారణంగా చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Read Also:Cyclone Michaung: మిచాంగ్ తుఫాను ఎఫెక్ట్.. అన్నదాతల ఆందోళన!
Also Read
ఇజ్రాయెల్ సైన్యం ఇళ్లపై దాడి చేసిందని, ఇందులో సుమారు 45 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. హమాస్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ పోరాటంలో ఇప్పటివరకు 7112 మంది పిల్లలు, 4885 మంది మహిళలు మరణించారు. దీంతో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 16,248 మంది మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు.
Read Also:Dog Temple In Up: వందేళ్లుగా శునకానికి పూజలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!
IDF ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు, నగరంలో కొత్త సూచనలతో కూడిన కరపత్రాలను వదిలివేసింది. ఇంట్లో నుంచి బయటకు రావద్దు, బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరం అని అందులో రాసి ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవి ప్రకారం, ఉత్తర గాజాలోని అనేక ప్రాంతాలు ఉగ్రవాద రహితంగా మారాయి. ఇప్పుడు దక్షిణాదిలో హమాస్పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హమాస్ అగ్ర కమాండర్లను నిర్మూలించడమే మా లక్ష్యం.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!