Israel: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయెల్పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ను ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ను చేపట్టామని, పౌరులకు హాని చేయడం కంటే హమాస్ మిలిటెంట్లను ఎదుర్కోవడమే లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి ఒకరు సోమవారం తెల్లవారుజామున తెలిపారు.
Read Also: Sidhu Moosewala Mother: 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సిద్దూ మూసేవాలా తల్లి
Also Read
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
“హమాస్కు చెందిన సీనియర్ ఉగ్రవాదులు అల్-షిఫా ఆసుపత్రిలో మళ్లీ గుమిగూడారని, ఇజ్రాయెల్పై దాడులకు ఆదేశిస్తున్నారని మాకు తెలుసు” అని డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి హగారి చెప్పారు. పౌర ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ఆపరేషన్ ఖచ్చితత్వంతో, జాగ్రత్తగా నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. రోగులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, వదిలి వెళ్లాలనుకున్నా ఒక మార్గం అందుబాటులో ఉందన్నారు. ఆసుపత్రి కాంపౌండ్లో రోగులకు సహాయం చేయడానికి అరబిక్ మాట్లాడేవారిని, వైద్య సిబ్బందిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నియమించిందని చెప్పారు. పౌరులకు మానవతా సహాయం అందిస్తోందని వెల్లడించారు. వైద్య సదుపాయాలను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించకూడదని చెబుతూ హమాస్ ఉగ్రవాదులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. “వైద్య సౌకర్యాలను టెర్రరిజం కోసం ఉపయోగించుకోకూడదు. హమాస్ తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి” అని హగారి తన చిన్న వీడియో సందేశాన్ని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసారు.
Read Also: Rahul Gandhi : ‘జైట్లీ నా వద్దకు వచ్చి.. భూసేకరణపై మాట్లాడకండి అన్నారు’.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఇంతలో గాజాలోని హమాస్-నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఆపరేషన్పై ఒక ప్రకటన విడుదల చేసింది, “అల్-షిఫా మెడికల్ కాంప్లెక్స్లోని వైద్య సిబ్బంది, రోగులు, ఎక్కడి నుంచో వ్యక్తుల జీవితాలకు ఇజ్రాయెల్ బాధ్యత వహిస్తుంది” అని పేర్కొంది. ఈ దళాలు చేస్తున్న ఆక్రమణ.. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని ఈ ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!