Extramarital Affair: చెన్నైలో దారుణం..మహిళ ప్రాణం తీసిన అక్రమ సంబంధం..
చైన్నై రైల్వే స్టేషన్ లో దారుణం వెలుగు చూసింది.. రైల్వే స్టేషన్ లో పండ్ల వ్యాపారం చేసే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం.. ఆమె హత్య జరగడానికి కారణాలు వివాహేతర సంబంధాలే అని సమాచారం.. ఈ దారుణ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది.. ఆమె చనిపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన తో ఒక్కసారిగా అందరు ఉలిక్కి పడ్డారు..
ఈ ఘటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. రాజేశ్వరి, ఆమె భర్త భువనేశ్వర్ మీనంబాక్కం ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం రాజేశ్వరి రోజూ రైల్వే స్టేషన్లలో పండ్లు, సమోసాలు అమ్ముతుండేది. బుధవారం నాడు కూడా రోజులాగే వ్యాపారాన్ని ముగించుకొని సాయంత్రాని కి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లడం కోసం సైదాపేట రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది… ఆ సమయంలో నలుగురు వ్యక్తులు రైలు నుంచి దిగారు.. రైలు కోసం వెయిట్ చేస్తున్న ఈమెపై విచక్షణా రహితంగా దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి మరో రైలు ఎక్కి పారిపోయారు..
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆమెను అక్కడే ఉన్న రైల్వే పోలీసులు ఆసుపత్రి కి తరలించారు..అక్కడ చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు రాజేశ్వరి కి పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యం లోనే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ సైదాపేట రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు లేవు. దీంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె ఫోన్లోని నెంబర్స్ ఆధారంగా వారిని వెంటనే కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!