ఐపీఎల్ అంటేనే పరుగుల వర్షానికి పెట్టింది పేరు. సింగిల్స్ వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్లు వస్తుంటాయి. ఐపీఎల్ ముగిసే సమయానికి బౌండరీల కౌంట్ మీటర్ రికార్డులు సృష్టించడం చూస్తుంటాం. గత 15 సీజన్లలో ఇదే తరహాలో బ్యాటర్లు పండగా చేసుకున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్లు పోటీపడి పరుగులు సాధించేవారు. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ లో బ్యాటర్లకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని క్రీడా నిపుణులు అంటున్నారు.
Also Read : Dasara: రికార్డ్ హిట్ కొట్టిన నాని… కొన్ని సెంటర్స్ లో స్టార్ హీరోల రికార్డులు గల్లంతు
అర్థం కానీ పిచ్ ల కారణంగా టీ20 క్రికెట్ లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు టీ20లు అంటే పరుగుల ప్రవాహం అనేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలర్లు కూడా పండగా చేసుకుంటున్నారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ టీ20 మ్యాచ్ ను కాస్త టీ10 మ్యాచ్ లుగా మారుస్తున్నారు. ఇక ఇవాళ ఐపీఎల్ సీజన్ 16 ఆరంభ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న మ్యాచ్ లో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా.. బ్యాటర్లకా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

Also Read : Police Station Robbery: ఇదేందయ్యా ఇది.. పోలీస్స్టేషన్లోనే దోపిడీ.. విలువైన వెండి ఆభరణాలు మాయం
నిజానికి అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందంటున్నారు. ఇక్కడి పిచ్ పై తేమ ఎక్కువగా ఉంటుండడంతో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. తొలి ఇన్సింగ్స్ లో 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టుకే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లోస్కోరింగ్ లు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అహ్మదాబాద్ మాత్రమే కాదు.. ఐపీఎల్ మ్యాచ్ లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడి పిచ్ లు ఎలా స్పందిస్తాయో ముందే చెప్పలేని స్థితి ఏర్పడింది.
Also Read : Ajay Devgn: భారతదేశ ఫుట్ బాల్ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం ఈ కథ…
అయితే క్యూరేటర్లు మాత్రం బ్యాటర్లు పండగ చేసుకునేలానే పిచ్ లు రూపొందించినట్లు పేర్కొంటున్నారు. అయితే వాళ్ల మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ఇంకో కారణం ఉంది. అదే వాతావరణం సమస్య. ప్రస్తుతం క్యుములో నింబస్ మేఘాల వల్ల ఉపరితల ఆవర్తనం రోజురోజుకి మారుతూ వస్తుంది. దీంతో పిచ్ లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండటం లేదని క్రీడా విశ్లేషకులు వాపోతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఐపీఎల్ 16వ సీజన్ బ్యాటర్ల మెరుపులు కాస్త తక్కువే ఉండొచ్చు.