Police Station Robbery: ఇదేందయ్యా ఇది.. పోలీస్స్టేషన్లోనే దోపిడీ.. విలువైన వెండి ఆభరణాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Station Robbery: ఎవరింట్లో అయినా దొంగలు పడితే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి ఆ పోలీస్స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి?. అలాంటి ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగింది. ఏకంగా రూ.75లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్నూల్ తాలూకా అర్బన్ పోలీస్స్టేషన్లో రూ.75లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీరువాలో దాచిన 105 కిలోల వెండి, డబ్బు కనిపించకపోవడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఎవరు వాటిని దొంగిలించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: Kanpur : కాన్ఫూర్ లోని అగ్ని ప్రమాదం.. 500 బట్టల దుకాణాల్లో మంటలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఏం జరిగిందంటే.. రెండేళ్ల క్రితం పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ. 2 లక్షల 5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఆభరణాలను, నగదును పోలీస్ స్టేషన్లో ఉన్న బీరువాలో దాచారు. ఇటీవల సదరు యజమానులు కోర్టు నుంచి అనుమతి పొంది పీఎస్కు చేరుకుని వెండి, నగదు అప్పగించాలని కోరారు. దాంతో సీఐ బీరువా తెరిచి చూడగా.. బీరువాలో వెండి, నగదు కనిపించలేదు. దీంతో సీఐ రామలింగయ్య నిర్ఘాంతపోయారు. వెండి, నగదు సీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నలుగు సీఐలు బదిలీ అయ్యారు. దీంతో వారందరినీ పిలిపించి విచారించడం మొదలుపెట్టారు అధికారులు. స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!