Police Station Robbery: ఇదేందయ్యా ఇది.. పోలీస్స్టేషన్లోనే దోపిడీ.. విలువైన వెండి ఆభరణాలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Station Robbery: ఎవరింట్లో అయినా దొంగలు పడితే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి ఆ పోలీస్స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి?. అలాంటి ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగింది. ఏకంగా రూ.75లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్నూల్ తాలూకా అర్బన్ పోలీస్స్టేషన్లో రూ.75లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీరువాలో దాచిన 105 కిలోల వెండి, డబ్బు కనిపించకపోవడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఎవరు వాటిని దొంగిలించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: Kanpur : కాన్ఫూర్ లోని అగ్ని ప్రమాదం.. 500 బట్టల దుకాణాల్లో మంటలు
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఏం జరిగిందంటే.. రెండేళ్ల క్రితం పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ. 2 లక్షల 5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఆభరణాలను, నగదును పోలీస్ స్టేషన్లో ఉన్న బీరువాలో దాచారు. ఇటీవల సదరు యజమానులు కోర్టు నుంచి అనుమతి పొంది పీఎస్కు చేరుకుని వెండి, నగదు అప్పగించాలని కోరారు. దాంతో సీఐ బీరువా తెరిచి చూడగా.. బీరువాలో వెండి, నగదు కనిపించలేదు. దీంతో సీఐ రామలింగయ్య నిర్ఘాంతపోయారు. వెండి, నగదు సీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నలుగు సీఐలు బదిలీ అయ్యారు. దీంతో వారందరినీ పిలిపించి విచారించడం మొదలుపెట్టారు అధికారులు. స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?