IMLT20: గుడ్ న్యూస్.. మరోమారు టీమిండియా కెప్టెన్గా సచిన్
- ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025).
- ఐఎమ్ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్ తో ముగిస్తుంది.
- టీమిండియా జట్టు కెప్టెన్గా సచిన్ టెండుల్కర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMLT20: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతేడాది ప్రారంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ లీగ్ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు పూర్తి సన్నాహాలు చేశారు. ఐఎమ్ఎల్ టోర్నీ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభమై, మార్చి 16న ఫైనల్తో ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ లీగ్ మూడు వేదికలపై జరగనుంది. ఇక ఈ లీగ్లో ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారతదేశం, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ లీగ్లో రిటైర్ అయిన క్రికెటర్లు పాల్గొంటారు.
Also Read: Mahakumbh 2025: కుంభమేళాలో సకాలంలో పూల వర్షం కురిపించలేకపోయిన అధికారులు.. ముగ్గురిపై ఎఫ్ఐఆర్
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ఇకపోతే టీమిండియా జట్టుకు సచిన్ టెండుల్కర్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. అలాగే ఆస్ట్రేలియా జట్టుకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికా జట్టుకు జాక్వెస్ కలిస్, వెస్టిండీస్ జట్టుకు బ్రియన్ లారా, శ్రీలంక జట్టుకు కుమార్ సంగక్కర, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ లు సారథ్యం వహించనున్నారు. ఈ లీగ్కు సంబంధించి సునిల్ గావస్కర్ను కమిషనర్గా నియమించారు. గావస్కర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. “ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను ఒకే వేదికపై కనిపించేలా ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తాం” అని తెలిపారు. వాస్తవానికి, ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పోలాక్ కూడా ఉన్నారు.
Also Read: Sanju Samson: సంజు శాంసన్పై బీసీసీఐ ఫైర్.. కారణం అదేనా?
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్కు సంబంధించి వేదికలు ఇంకా ఖరారు కాలేదు. అయితే, డీవై పాటిల్ స్టేడియం (నవీ ముంబై), నిరంజన్ షా స్టేడియం (రాజ్కోట్), షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం (రాయ్పూర్) ఈ లీగ్ కోసం పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఐసీసీ వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర జట్లు పోటీపడతాయి. ఐఎమ్ఎల్ కూడా ఫిబ్రవరి 22న ప్రారంభమవుతుంది. అంటే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలైన మూడు రోజులకే ఐఎమ్ఎల్ ప్రారంభం అవుతుంది. దీనితో సచిన్ టెండుల్కర్ మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో కనిపించనుండటం క్రికెట్ అభిమానులకు పండుగా కానుంది.
తాజావార్తలు
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!