Divorce: వేరు కాపురం అంటున్న భార్యలకు షాక్.. అలాంటి వారికి ఇక విడాకులే అన్న కోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Insists Husband For Seperate Family: పెళ్లి అనే బంధంతో ఓ ఆడ పిల్ల తన పుట్టింటిని వదిలి అత్తింటిలో అడుగుపెడుతుంది. భర్తతో కలిసి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తన అత్తమామలనే అమ్మా నాన్నలు అనుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అత్త మామను శత్రువుల్లా చూస్తూ భర్త మాత్రమే చాలు.. నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటే ఆ ఇంట్లో వారు ఎంత మంచిగా ఉన్నా వేరు కాపురం కావాలనే అనిపిస్తుంది. అయితే అటువంటి సందర్భాల్లో కన్న వారిని వదలలేక, కట్టుకున్న దానికి సర్ధి చెప్పలేక ఆ భర్త సతమతమవుతుంటాడు. మానసికంగా కుంగిపోతూ ఉంటాడు. కొత్తమంది భార్యలైతే వేరు కాపురానికి ఒప్పుకోకపోవడంతో ఏకంగా పెళ్లైన కొత్తలోనే భర్తను దూరం పెడుతున్నారు. అలాగైనా భర్తను తమ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అయితే వేరు కాపురం కోసం భర్తను దూరం పెట్టిన ఓ భార్యకు కోర్టు షాకిచ్చింది. ఈ తీర్పు అత్తామామల నుంచి భర్తను దూరం చేయాలనుకునే ప్రతి భార్యకు ఒక గుణపాఠంలా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. 2002 లో ఓ జంటకు వివాహమయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య తన అత్తమామలతో కాకుండా వేరు కాపురం పెడదామని భర్తను తరచూ వేధించేది.అయితే ఆ భర్త మాత్రం తల్లిదండ్రులను వదిలేసి వచ్చే ప్రసక్తేలేదని ఆమెకు తెగేసి చెప్పాడు. దీంతో ఆమె తన అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు స్థానిక పోలీసులను సంప్రదించగా ఆమె గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె అనేక సార్లు తన భర్త కుటుంబంపై ఫిర్యాదు చేసిందని, ఒకసారి తన అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించారని కోర్టుకు తెలిపిన ఆమె మరొకసారి తన మామ తనపై అత్యాచారం చేయబోయడానికి ఫిర్యాదు చేసిందని స్థానిక పోలీసులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. అయితే వీటిని ఆ మహిళ నిరూపించలేకపోవడంతో ఫ్యామిలీ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఇక భార్య వేధింపులు తట్టుకోలేక ఆ భర్త 2007 లో అంటే పదహారేళ్ల క్రితం తనకు విడాకులు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఆ భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. విదేశాల్లో లాగా భారతదేశంలో మేజర్ కాగానే లేదా పెళ్లికాగానే తల్లిదండ్రులను విడిచే సంస్కృతి లేదని పేర్కొంది. అది హిందూ సంప్రదాయానికి విరుద్ధం. అంతేకాకుండా వృద్ధాప్యంలో వారిని విడిచి వెళ్లడం నైతికంగా, చట్టపరంగా కూడా న్యాయం కాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా కొడుకుకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని నెరవేర్చాల్సిందే అని ధర్మాసనం పేర్కొంది. ఇక తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురం పెట్టాలని భర్తను వేధించడం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని వాదనలు విన్న స్టిస్ సురేశ్ కుమార్ కైట్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. అటువంటి భార్యకు విడాకులు ఇవ్వొచ్చని పేర్కొన్న కోర్టు ఆ భర్తకు విడాకులు మంజూరు చేసింది. వేరు కాపురం పెట్టాలనుకున్న భార్యలకు ఇది ఒక గుణపాఠం అని ఈ తీర్పు విన్నవారు అభిప్రాయపడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!