Konda Surekha : ఇందిరమ్మ ఇళ్లకు కొత్త ఊపిరి.. వరంగల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించిన మంత్రి కొండా సురేఖ
- 15 సంవత్సరాల తర్వాత పేదవారికి ఇండ్ల నిర్మానాలకు జరుగుతున్నాయి
- నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లను నిర్మాణమే లక్ష్యం : కొండా సురేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : వరంగల్ తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆవాసం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె తెలిపారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. కొండా సురేఖ మాట్లాడుతూ, తాను టీఆర్ఎస్ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలిగా ఉన్నప్పుడు కూడా ఇళ్ల కోసం కృషి చేసినప్పటికీ, అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదని విమర్శించారు. “ఇప్పటికైనా ఇల్లు నిర్మించడం బీఆర్ఎస్ చేతకాదని ప్రజలకు అర్థమవుతోంది. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
Daggubati Purandeswari: పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం!
ఇటీవల వరంగల్ తూర్పులో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడిన ఆమె, “నేను శాసనసభ్యురాలిగా పనిచేసిన సమయంలో చేసిన అభివృద్ధే ఇప్పటికీ ప్రజలకు కనిపిస్తోంది. గత ఎమ్మెల్యే ఏం చేశాడో ప్రజలే చెబుతున్నారు” అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి కూడు, గుడ్డా, నీడ కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొదటి విడతలో అవకాశం రాకపోయినవారికి రెండవ విడతలో అవకాశం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
అంతేకాదు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆమె గుర్తుచేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపైనే మంజూరు చేయనున్నట్లు తెలిపారు. చివరిగా, తూర్పు నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికీ అండగా నిలబడి, అందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా తాను పూనుకుంటానని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!