World Cup 2023: ఏందీ మావా.. టీమిండియాను భ్రష్టు పట్టిస్తున్నారు.. మీకంటే పాకిస్థానోళ్లు నయం కదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ హాట్ కామెంట్స్ చేశారు. మెగా ఈవెంట్లు సమీపిస్తుండగా.. ఈ పిచ్చి ప్రయోగాలు చేస్తూ.. జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పోలిస్తే.. ప్రెసెంట్ పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉందని అన్నాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ స్టార్ట్ కానుంది. శ్రీలంక, పాకిస్తాన్లలో నిర్వహించనున్న ఈ టోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే టీమ్ ను ప్రకటించింది. అయితే, ఈ ఈవెంట్కు ముందు వెస్టిండీస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది.
Read Also: DPDP Bill – 2023: చట్టంగా మారిన DPDP..
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
అయితే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్ ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టి.. యంగ్ క్రికెటర్లకు అవకాశం ఇచ్చింది. అయితే, తొలి మ్యాచ్ ను కష్టమ్మీద గెలిచిన టీమిండియా.. సెకండ్ వన్డేలో ఓడిపోయింది. ఇక మూడో వన్డేలో ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ సహా సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా రాణించడంతో 200 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కానీ.. ఆసియా కప్ లాంటి కీలక ఈవెంట్కు ఇలాంటి ప్రయోగాలు ఎందుకనే విమర్శలు వస్తున్నాయి.
Read Also: Stealing Purse: అయ్యో పాపం… పర్స్ కొట్టేయడానికి ట్రై చేసి ఇలా బుక్ అయిపోయాడేంటి..!
ఆసియా కప్, ప్రపంచకప్ ఈవెంట్లకు టీమిండియాతో పోలిస్తే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది అని పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సర్ఫరాజ్ నవాజ్ అన్నారు. ఈ మెగా ఈవెంట్లకు టీమిండియా సరైన కాంబినేషన్ను కూడా సెట్ చేయలేకపోయింది అని విమర్శలు గుప్పించాడు. తరచూ కెప్టెన్లను మారుస్తూ.. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తున్నారు.. అయినా ఇప్పటికీ జట్టు కూర్పుపై అవగాహనకు రాలేకపోయారు అని ఆయన కామెంట్స్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే టీమ్ మేనేజ్మెంట్.. భారత క్రికెట్ను అభివృద్ధి చేయడానికి బదులు నాశనం చేస్తున్నారనిపిస్తోంది అని సర్ఫరాజ్ నవాజ్ అన్నారు.
Read Also: MP Arvind : కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే
అయితే, సర్ఫరాజ్ నవాజ్ చేసిన కామెంట్లకు టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ముందు మీ జట్టు సంగతి చూసుకోండి.. మా టీమ్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని విమర్శలు గుప్పించారు. కాగా ఆసియా కప్ టోర్నీలో సెప్టెంబరు 2న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ఆడుతుంది.
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!