Mukesh Ambani: 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
Vibrant Gujarat: గుజరాత్ అభివృద్ధికి రిలయన్స్ సంస్థ కట్టుబడి ఉంటుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇవాళ గాంధీనగర్లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్లో ఆయన మాట్లాడుతూ.. గుజరాత్లో తన మూలాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కంపెనీ నిబద్ధత గురించి తెలియజేశారు. రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 20 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోందన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
Read Also: MLA Katasani Rami Reddy: చంద్రబాబు కామెంట్లపై కాటసాని కౌంటర్ ఎటాక్
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
ఇక, మోడీ ప్రపంచ నాయకత్వాన్ని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల నాయకుడని అంబానీ చెప్పుకొచ్చారు. ప్రధానిగా మోడీ ఉంటేనే అన్ని సాధ్యం అవుతాయని చెప్పారు.. విజన్, డిటర్మినేషన్, ఎగ్జిక్యూషన్ ఉన్న ప్రధాని మోడీ కోట్ల మంది భారతీయులను ప్రతిబింబిస్తుంది.. ప్రపంచ దేశాల ప్రశంసలను ప్రస్తుతం భారత్ అందుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంలో రిలయన్స్ $150 బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.. ఇందులో మూడింట ఒక వంతు గుజరాత్కే కేటాయించామని తెలిపారు.. రిలయన్స్ రాబోయే పదేళ్లలో గణనీయమైన పెట్టుబడులతో గుజరాత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పుకొచ్చారు.. గ్రీన్ గ్రోత్లో గుజరాత్ ప్రపంచ అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.
Read Also: BCCI Awards 2024: హైదరాబాద్లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్.. ప్రత్యేక అతిథులు ఎవరంటే?
2030 నాటికి రాష్ట్ర ఇంధన అవసరాలలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కృషి చేస్తుంది అని ముఖేష్ అంబానీ చెప్పారు. రిలయన్స్ జియో ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలను అత్యంత వేగంగా మార్కెట్ లోకి తీసుకొచ్చాం.. గుజరాత్ను పూర్తిగా 5జీ-ఎనేబుల్ చేశాం.. డిజిటల్ డేటా ప్లాట్ఫారమ్తో పాటు ఏఐ అడాప్షన్లో గుజరాత్ స్టేట్ గ్లోబల్ లీడర్గా నిలిచింది అని ఆయన తెలిపారు. 5జీ-ఎనేబుల్డ్ ఏఐ విప్లవం మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వస్తుందని అంబానీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!