India-China: ఎల్ఏసీపై పెట్రోలింగ్కు సంబంధించి భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం..
- ఎల్ఏసిపై పెట్రోలింగ్కు సంబంధించి భారతదేశం-చైనా మధ్య కొత్త ఒప్పందం
- విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల
- గత కొన్ని వారాలుగా దౌత్య.. సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి- విదేశాంగ కార్యదర్శి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి)పై పెట్రోలింగ్కు సంబంధించి భారతదేశం-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తాము చైనాతో సమస్యలపై ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పారు. అలాగే.. బలగాల ఉపసంహరణ, పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు.. ద్వైపాక్షిక చర్చలపై విలేకరులు ప్రశ్నలు సంధించారు. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పందిస్తూ.. సమయానుకూలంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: Supreme Court: ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. విచారణ వాయిదా
Also Read
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. “గత కొన్ని వారాలుగా జరిగిన చర్చల కారణంగా, భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. 2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలు పరిష్కారమవుతున్నాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి గత కొన్ని వారాలుగా భారత్, చైనా చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు. “ఈ ఒప్పందం డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలలో పెట్రోలింగ్ ఏర్పాట్లకు సంబంధించినది.” అని తెలిపారు.
Read Also: Actress Shabrin: మేనమామతో ప్రేమాయణం.. మేనల్లుడి కిడ్నాప్ కేసులో నటి అరెస్ట్
తూర్పు లడఖ్ సరిహద్దులో 2020లో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. అదే సమయంలో చైనా సైనికులు మరణించారు. అప్పటి నుండి రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..