World Archery Championships 2023: విల్లు ఎక్కుబెట్టిన తెలుగమ్మాయి.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India wins first gold medal in World Archery Championships: ఎట్టకేలకు భారత్ ఆర్చరీ ‘పసిడి’ కల నెరవేరింది. ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి మరియు పంజాబ్ ప్లేయర్ పర్ణీత్ కౌర్ త్రయం గురి.. దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి. బెర్లిన్లో శుక్రవారం జరిగిన కాంపౌండ్ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్ భారత జట్టు 235-229 తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచింది.
తమకంటే బలమైన జట్లను ఓడిస్తూ ఫైనల్ దూసుకెళ్లిన భారత అమ్మాయిలు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించారు. ప్రత్యర్థి మెక్సికో పటిష్ఠంగా ఉన్నా.. గాలి తీవ్రత అధికంగా ఉన్నా.. ఏ మాత్రం పట్టు వదలకుండా అద్భుత ఆటతో స్వర్ణం గెలిచారు. డాఫ్ని క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై భారత అమ్మాయిలు తొలి రౌండ్ నుంచే ఆధిపత్యం చెలాయించారు. తొలి రౌండ్లో 60కి 59 స్కోరు చేశారు. 2, 3 రౌండ్లలోనూ 59 చొప్పున పాయింట్లు సాధించిన భారత అమ్మాయిలు.. చివరి రౌండ్కు ముందు 177-172తో ఆధిక్యంలో నిలిచారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
చివరి రౌండ్ చివరి సెట్కు ముందు భారత్ 207-199తో ముందంజలో నిలిచింది. చివరి సెట్లో మెక్సికో ఆర్చర్లు ముగ్గురు పదేసి చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 237కు చేరింది. ఆ దశలో భారత అమ్మాయిలు పర్ణీత్ 10 పాయింట్లు సాధించగా.. అదితి 9 పాయింట్లు సాధించింది. ఇక మరో 5 పాయింట్లు గెలిస్తే భారత్ ఖాతాలో స్వర్ణం చేరుతుంది. ఈ సమయంలో బాణం చెరపట్టిన తెలుగమ్మాయి సురేఖ 9 పాయింట్లు సాధించింది. దీంతో భారత్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది.
2017, 2021 ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లలో ఫైనల్ చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం స్వర్ణం నెగ్గి భారత జెండాను రెపరెపలాడించారు. ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ 12 పతకాలు నెగ్గింది. ఇందులో 1 స్వర్ణం, 9 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగం క్వార్టర్స్లో నేడు సహచర ఆర్చర్ పర్ణీత్తోనే జ్యోతి పోటీ పడనుంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!