Asia Cup 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్, కోహ్లీ పోటీ.. మరి గెలుపెవరిదో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma, Virat Kohli likely to surpass Sachin Tendulkar in Asia Cup 2023: క్రికెట్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆగష్టు 30న పాకిస్తాన్లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్లు టోర్నీ తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. ఇక దాయాదులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబరు 2న జరగనుంది. ఈ సారి ఎలా అయినా ఆసియా కప్ని పట్టేసుకోవాలని దాయాది జట్లు చూస్తున్నాయి. దాంతో ఇరు జట్ల మధ్య ఎప్పటిలానే మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. అయితే ఆసియా కప్ 2023 నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు ముంగిట నిలిచారు.
వన్డే ఫార్మాట్లో ఆసియా కప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 23 మ్యాచ్ల్లో 51.10 సగటుతో 2 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో 971 పరుగులు చేశాడు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ 21 ఇన్నింగ్స్లలో 46.56 సగటుతో 745 పరుగులు (ఒక సెంచరీ మరియు ఆరు అర్ధ సెంచరీలు) చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ కంటే 226 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఈ ఎడిషన్లో రోహిత్ చెలరేగితే సచిన్ రికార్డు బద్దలవుతుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2014లో వన్డే ఆసియా కప్లో చివరిసారి ఆడిన కోహ్లీ కేవలం 10 ఇన్నింగ్స్ల్లో 613 పరుగులు చేశాడు. ఆసియా కప్లో విరాట్ మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ చేశాడు. విరాట్ ఆల్టైమ్ వన్డే అత్యధిక స్కోరు 183 పాకిస్థాన్పై ఆసియా కప్లో సాధించాడు. ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్లో భారత క్రికెటర్లలో టాప్ స్కోరర్గా నిలిచేందుకు కోహ్లీకి ఇంకా 358 పరుగులు అవసరం.
Also Read: Red Card in Cricket: క్రికెట్లో తొలిసారి రెడ్ కార్డ్.. మొదటి బాధిత క్రికెటర్ ఎవరంటే?
సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు అవకాశం ఉంది. ఫామ్ను కొనసాగిస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు ఈసారి సచిన్ రికార్డు బద్దలు కొడతారు. ఆసియా కప్లో భారత్ మొత్తం 6 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజ్లో రెండు మ్యాచ్లు, సూపర్ ఫోర్ రౌండ్లో 3 మ్యాచ్లు (అంచనా), ఫైనల్ మ్యాచ్ (అంచనా) భారత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ తలపడనున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!