IND vs PAK: నిజానికి మ్యాచ్ రిఫరీ పాకిస్థాన్ను రక్షించాడు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘోర ఓటమి
- మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం
- ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే
- నిజానికి రిఫరీ పైక్రాఫ్ట్ పాకిస్థాన్ను రక్షించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్లో భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘోర ఓటమిని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీపై ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును పక్కనపెట్టింది. సూపర్-4లో ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. చిరకాల పోరు ఆలోచనే తమకు లేదని చెప్పాడు. ఈ మ్యాచ్ కేవలం ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే అని పేర్కొన్నాడు. దీంతో పాక్ మ్యాచ్ను భారత్ తక్కువగా చూస్తోందని ఆ దేశ మాజీలు వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ మాజీల వ్యాఖ్యలను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పి కొట్టాడు. పాక్తో మ్యాచ్ను తాము ఎక్కడా తక్కువగా చూడలేదని, వాస్తవ పరిస్థితులను భారత్ చెప్పిందన్నాడు. ‘భారత్, పాకిస్థాన్ పోరుకు ఉన్న హైప్ను టీమిండియా ఎక్కడా తక్కువ చేయలేదు. కేవలం ప్రస్తుతం వాస్తవ పరిస్థితులను వెల్లడించింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెటర్ల మనోభావాలను చెప్పాడు. సమస్యంతా పాకిస్థాన్ జట్టుదే. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్పై ఆందోళన వ్యక్తం చేయడం సరికాదు. నిజం చెప్పాలంటే అతడు పాక్ జట్టును రక్షించాడనే చెప్పాలి. పాక్ మ్యాచ్ ఓడినా మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు రాలేదు. దృష్టంతా పైక్రాఫ్ట్ వైపు మళ్లింది’ అని యాష్ చెప్పాడు.
Also Read
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
Also Read: Xiaomi Diwali Sale 2025: షావోమీ దీపావళి సేల్.. ఫోన్లు, స్మార్ట్ టీవీలపై 60 శతం తగ్గింపు!
‘కరచాలనం విషయంలో భారత జట్టు ముందే మ్యాచ్ రిఫరీకి తమ నిర్ణయం ఏంటో చెప్పింది. అంతా జరిగిన తర్వాత పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోయింది. అయినా విమర్శలు రాలేదు. బలవంతంగా ఆటగాళ్లతో కరచాలనం చేయించడానికి రిఫరీ ఏమీ స్కూల్ టీచర్ కాదు, ప్రిన్సిపల్ కూడా కాదు. సూర్యకుమార్ యాదవ్ వద్దకు వెళ్లి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయమని రిఫరీ చెప్పలేడు. ఎందుకంటే అది అతడి బాధ్యత కాదు. అందుకే పైక్రాఫ్ట్ తప్పేమీ లేదు. అనవసరంగా పాక్ రాద్ధాంతం చేస్తోంది’ అని అనవసరంగా పాక్ మాజీలు రాద్ధాంతం చేస్తున్నారని వివరించాడు.
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!