Lord’s Test: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తెలుగోడి దెబ్బ.. వీడియో వైరల్!
- ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తెలుగోడి దెబ్బ
- ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టిన నితీష్ రెడ్డి
- లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 83/2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మెరిశాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ 14 ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) అవుట్ కాగా.. చివరి బంతికి జాక్ క్రాలీ (18) పెవిలియన్ చేరాడు. ఇద్దరు ఓపెనర్లు వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చారు. రెండు వికెట్స్ పడగొట్టిన తెలుగు కుర్రాడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆచితూచి ఆడారు. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ను అడ్డుకుని పరుగులు చేశారు. 13 ఓవర్లు అయినా వికెట్ పడకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డికి కెప్టెన్ శుభ్మన్ గిల్ బంతిని అందించాడు. నితీశ్ తన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టి టీమిండియాకు శుభారంభం ఆడించాడు. తెలుగు కుర్రాడు నితీశ్ వికెట్లను సంబందించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
Also Read: Jagan Mohan Rao: హెచ్సీఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. రూ.170 కోట్లు స్వాహా!
మూడో టెస్టులో మొదటి రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (18), బెన్ డకెట్ (23) అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఓలి పోప్ (12), జో రూట్ (24) ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి 5 ఓవర్లు వేసి 15 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8, ఆకాష్ దీప్ 7, మహమ్మద్ సిరాజ్ 5 ఓవర్లు వేశారు. దూకుడుగా ఆడుతున్న రూట్ను అవుట్ చేయాల్సి ఉంది.
England players tackled well all the top bowlers of India
Bumrah , Siraj and Akashdeep
But Nitish Kumar Reddy came out of Syllabus ♥️🔥#INDvsENG pic.twitter.com/5E6ViTO0n5— Raw Takes Only💅🏼 (@rawtakesonly) July 10, 2025
తాజావార్తలు
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!