Jagan Mohan Rao: హెచ్సీఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. రూ.170 కోట్లు స్వాహా!
- ఎస్ఆర్హెచ్తో టికెట్ల వివాదం
- జగన్మోహన్ రావును అదుపులోకి తీసుకున్న సీఐడీ
- హెచ్సీఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావును తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో.. జగన్మోహన్ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. జగన్మోహన్తోపాటు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అరెస్ట్ చేసి విచారించింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెండేళ్లలో 170 కోట్ల రూపాయలు హెచ్సీఏలో గోల్మాల్ జరిగినట్లు సీఐడీ గుర్తించింది. ప్లేయర్స్ ఎంపికలో అవినీతి చేసినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. హెచ్సీఏ సభ్యులు ప్లేయర్స్ తల్లిదండ్రులు నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. హెచ్సీఏలో చెక్ పవర్ను దుర్వినియోగం చేసినట్లు తేలింది. బీసీసీఐ ద్వారా వచ్చిన నిధుల్లో గోల్మాల్ జరిగిందని సీఐడీ పేర్కొంది. ఎస్ఆర్హెచ్ నుంచి కాంప్లెమెంట్రీ పాస్లను సైతం బ్లాక్లో అమ్ముకొని నిందితులు సొమ్ము చేసుకున్నారు. క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన కాంప్లెమెంటరీ పాస్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తేలింది. ఎస్ఆర్హెచ్పై జగన్మోహన్ రావు వేధింపుల వ్యవహారంలో యాజమాన్యం స్టేట్మెంట్ను సీఐడీ రికార్డ్ చేసింది.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
Also Read: HCA: మాజీ మంత్రి సంతకం ఫోర్జరీ, వందల కోట్లు దోపిడీ.. జగన్మోహన్రావు అక్రమాల చిట్టా పెద్దదే!
ఐపీఎల్ 2025 టికెట్ల కోసం జగన్మోహన్ రావు బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఆర్హెచ్,హెచ్సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొనడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని సీఐడీని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్హెచ్, టీసీఏ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీఐడీ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఆర్థిక అక్రమాలు, పత్రాల ఫోర్జరీ, బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు, నిధుల మల్లింపు విడుదల వంటి ప్రాథమిక ఆధారాలు సీఐడీ సేకరించింది. నివేదిక ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసి జగన్మోహన్ రావును అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క