Rohit Sharma: రెండు రోజుల ముందే వెళ్తాం.. అప్పుడు మేం చేసేదేముంటుంది?: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma React on Rajkot Pitch: భారత జట్టు ఎలాంటి పిచ్లపై అయినా విజయం సాధిస్తుందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టర్నింగ్ ట్రాక్లపై సుడులు తిరిగే బంతిని ఎదుర్కోవడంతో పాటు మిగతా పిచ్ల పైనా ఆడటం తమ బలం తెలిపాడు. పలానా పిచ్ తయారు చేయాలని ఎవరికీ చెప్పమని, అసలు పిచ్ గురించి చర్చించం అని రోహిత్ పేర్కొన్నాడు. మ్యాచ్కు రెండు రోజుల ముందే వేదిక వద్దకు వెళ్తామని, ఆ తక్కువ వ్యవధిలో తాము చేసేదేముంటుంది? అని ప్రశ్నించాడు. భారత్ టర్నింగ్ పిచ్ల సాయంతో విజయాలు సాధిస్తుందనే కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఇలా రోహిత్ స్పందించాడు.
జ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ను 434 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు మూడో సెషన్లో బంతి బాగా టర్న్ అవ్వడంతో భారత స్పిన్నర్లు చెలరేగారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 2, ఆర్ అశ్విన్ 1 వికెట్ తీశారు. భారత్ టర్నింగ్ పిచ్ల సాయంతో విజయాలు సాధిస్తుందనే కామెంట్ల నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘టర్నింగ్ పిచ్లపై ఇప్పటికే మేం చాలా మ్యాచ్లు గెలిచాం. ఇలాంటి ట్రాక్లపై మాత్రమే కాదు మిగతా పిచ్ల పైనా మేం బాగా ఆడుతాము. భవిష్యత్తుల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తాం. పలానా (టర్నింగ్) పిచ్ తయారు చేయాలని ఎవరికీ చెప్పం. మ్యాచ్కు రెండు రోజుల ముందే వేదిక వద్దకు వెళ్తాం. అంత తక్కువ వ్యవధిలో మేం చేసేదేముంటుంది?. పిచ్ను ఎలా తయారు చేయాలనేది క్యూరేటర్ ఇష్టం. ఎలాంటి మైదానంలో అయినా గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో మేం అద్భుత విజయం సాధించాం. ఆ పిచ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
Also Read: Ranchi Test: కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు! యశస్వి డౌటే
‘ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టుల్లో భిన్న సవాళ్లు ఎదుర్కొన్నాం. హైదరాబాద్ పిచ్ మందకొడిగా ఉంది. స్పిన్ అయినా బంతి చాలా స్లోగా వచ్చింది. వైజాగ్లో మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ నెమ్మదించింది. రాజ్కోట్లో నాలుగో రోజు బంతి టర్న్ అయింది. భారత్లో ఇలాంటి పరిస్థితులు సాధారణం. విదేశాల్లోనూ ఇలాంటి పిచ్లు ఉంటే.. అక్కడా మేం నాణ్యమైన ప్రదర్శన చేస్తాం. మూడో టెస్టులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. సొంత మైదానంలో జడేజా అదరగొట్టాడు. జైస్వాల్, గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక సర్ఫరాజ్ ఖాన్ గురించి అంతకుముందు విన్నా కానీ.. అతడి బ్యాటింగ్ చూడలేదు. జట్టులోకి తీసుకున్నాక అతడి గురించి ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. సర్ఫరాజ్ను అతడి సహజ ఆటను ఆడించాం’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!