Etela Rajender: రాష్ట్రంలో రూ. 4 వేల కోట్లు వసూలు చేసి రాహూల్ గాంధీకి పంపిస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఆరు నెలలుగా తెలంగాణలో రూ. 4 వేల కోట్లు అక్రమంగా వసూలు చేసి, రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. పరకాలలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. “సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రే ఈ గడ్డ మీదకు వచ్చి ఈ ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని చెప్పాడంటే ఆలోచించండి. ప్రతీ ఒక్కరూ బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డికే ఓట్లు వేస్తామంటున్నారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏళ్లుగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదు. గతంలో కేసీఆర్ అన్యాయం చేసినందుకు ఇంటికి పంపించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా డీఏలు చెల్లించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ హామీలు నిలబెట్టుకోలేదు. ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హామీలు నిలబెట్టుకోలేనందుకు బుద్ది చెప్పాలి. నిజాలు తెలుసుకుని ఓటును సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరుతున్నాను.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. చేవేళ్ల ఠాణాలో కేసు నమోదు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఎత్తిన జెండా దించకుండా, నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల కోసం పార్టీ కోసం జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అని ఈటల రాజేందర్ అన్నారు. “నల్గొండలో ఒక వ్యక్తి నడమంత్రపు సిరితో బీజేపీ ఎక్కడుంది అని అడిగాడు. 4 వ తేదీన తెలుస్తుందని చెప్పి వచ్చా. చాపకింద నీరులా తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటోంది. చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్లు, మనమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దీనిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రశ్నించే గొంతు అంటూ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు అధిష్టానం చేతిలో పిల్లిలా తయారయ్యారు. అధికార పార్టీలో ఉంటే ప్రశ్నించే అవకాశం ఉండదు. నేను పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమందితో భేటీలు, మీటింగులు నిర్వహించాను. అడ్వకేట్లతో, డాక్టర్లతో, నిరుద్యోగులతో, ఉపాధ్యాయులతో, ఉద్యోగులతో, అంగన్ వాడీలతో, ప్రైవేట్ ఉద్యోగులతో సమావేశాలు జరిగాయి. వారందరూ ఎన్నో బాధలు చెప్పుకున్నారు. శాసన సభలో కొట్లాడడానికి మనపార్టీ వాళ్లున్నారు. అలాగే శాసన మండలిలో కూడా ఏవీఎన్ రెడ్డి గారితో పాటు ప్రేమేందర్ రెడ్డి కూడా కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి బీజేపీ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది.” అని ఈటల పేర్కొన్నారు.
In the state Rs. 4 thousand crores are collected and sent to Rahul Gandhi
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!