NIA Rides: రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసుపై అనేక చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం బెంగళూరు, శివమొగ్గ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా బెంగళూరు నగరంలోని ఐదు చోట్ల, శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పట్టణంలోని కొన్ని ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో బాంబు పెట్టిన అతనికి ప్రత్యక్ష సంబంధం, అతనికి ఆర్థిక సహాయం అందించిన అనుమానిత వ్యక్తులపై దాడులు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్ఐఏ చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: ED Rides: దూకుడు పెంచిన ఈడీ.. పలు ప్రాంతాల్లో దాడులు..!
Also Read
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
- Virat Kohli: "ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు".. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
ఇకపోతే ఇప్పటివరకు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను ఏజెన్సీ మంగళవారం అదుపులోకి తీసుకుంది. అనుమానిత బాంబర్ తో ఇద్దరు నిందితులు ప్రత్యక్ష సంబంధంలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. ఈ ఇద్దరు అనుమానితుల సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్ఐఏ, పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పటికీ, బాంబర్ అంతుచిక్కడం లేదు. రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ఘటన జరిగిన వెంటనే అధికారులు మార్చి 1న బాంబర్ చిత్రాలు, వీడియోలను సీసీటీవీ ఫుటేజీ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Also read: IPL 2024: తొలి బంతికే సిక్సర్ కొట్టిన సిఎస్కే కుర్రాడు..!
బాంబు పేలుడుకు పాల్పడిన వ్యక్తి తమిళనాడు నుంచి వచ్చి రెండు నెలల పాటు ఉండి పేలుడుకు పాల్పడ్డాడని నిఘావర్గాలు అనుమానిస్తున్నట్లు సమాచారం. నిందితుడి జుట్టు నమూనాలను నిందితుడి టోపీ నుండి సేకరించారు. దానిని అతను బెంగళూరులో ఒక మతపరమైన ప్రదేశం సమీపంలో వదిలిపెట్టాడు. డీఎన్ఏ పరీక్షల కోసం జుట్టు శాంపిల్స్ను పంపిన అధికారులు వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించబడింది. ఇక ఈ సంఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు.
తాజావార్తలు
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!