CM Jagan’s Stone Pelting Case: సీఎం జగన్పై రాయి దాడి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు.. ఇంత జరిగిందా..?
CM Jagan’s Stone Pelting Case: విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సతీష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు బెజవాడ పోలీసులు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఇక, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు.. సీఎంను హత్య చేశాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను బయటపెట్టారు.. సీఎం జగన్ పై దాడి ఒకసారి మిస్ కావటంతో రెండో సారి మిస్ కాకుండా సతీష్ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. డాబా కోట్ల సెంటర్ లో దాడికి సిద్ధమై రాయి తీసినా.. ఫ్రెండ్ ఆపడంతో పాటు పోలీసులు, తోపులాట ఉండటంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట సతీష్.. ఆ తర్వాత 100 మీటర్ల దూరంలో ఉన్న వివేకానంద స్కూల్ ప్రహరీ పక్కన రోడ్ పై ఉన్న బెంచీ పక్కకు వెళ్లి రాయితో సతీష్ దాడి చేశారని చెబుతున్నారు.
Read Also: Vikas Raj: నామినేషన్లు ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు..
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఇక, దాడి చేసిన వెంటనే వెనుక నుంచి ఒకరు సతీష్ ను పట్టుకోగా వదిలించుకుని అక్కడి నుంచి పారిపోయాడట.. సీఎం జగన్ పై దాడి చేయాలని అందుకు డబ్బు ఇస్తానని దుర్గారావు అనే వ్యక్తి చెప్పటంతో సతీష్ దాడికి పాల్పడ్డాడట.. దుర్గారావు ప్రస్తుతం టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్నారు.. మరోవైపు.. దాడి చేసిన తర్వాత డబ్బుల కోసం దుర్గారావుకు ఫోన్ చేశాడట సతీష్.. ఫోన్ ఒకసారి మాట్లాడి రెండోసారి ఫోన్ కట్ చేసిన దుర్గారావు.. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడని పేర్కొన్నారు.. దాడి అనంతరం 5 నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోయాడు సతీష్.. కాగా, రెండేళ్ల క్రితం సెల్ ఫోన్ దొంగతనం కేసులో సతీష్ అరెస్ట్ అయినట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక, 2018 వరకు జనసేన పార్టీలో ఉండి.. 2 నెలల క్రితం బోండా ఉమా అధ్వర్యంలో టీడీపీలో చేరారట దుర్గారావు.. మరోవైపు.. డాబా కోట్ల సెంటర్ దగ్గర సీఎం జగన్పై దాడి చేయవద్దని సతీష్ను అతడి స్నేహితుడు చిన దుర్గారావు వారించాడట.. ఈలోపు ర్యాలీ దగ్గరగా రావడంతో.. పోలీసులు తోసేయటంతో వివేకానంద స్కూల్ దగ్గరకు వెళ్లి సతీష్ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!