PMO Office: డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై PMO ఉన్నత స్థాయి సమావేశం
- డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై PMO ఉన్నత స్థాయి సమావేశం
- ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం.
- కొత్త సుంకాల ప్రభావం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటనను అంచనా వేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, డీఐఐటీ ఇంకా ఇతర విభాగాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని, సుంకాల ప్రభావాలను పిఎంఓకు వివరించారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ట్రంప్ సుంకాలపై ఉన్నతస్థాయిలో అంచనాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
Read Also: Amazon Project Kuiper: తొలి ఇంటర్నెట్ ఉపగ్రహాల కోసం ప్రాజెక్ట్ ‘కైపర్’ను సిద్ధం చేసిన అమెజాన్
Also Read
ఇందులో భాగంగా.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ట్రంప్ సుంకాలపై స్పందిస్తూ, ఈ నిర్ణయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం వాణిజ్య సంబంధిత సమస్యలను పరిష్కరిస్తే, అమెరికా ఈ సుంకాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం షాక్ కలిగించదని, మిశ్రమ ఫలితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, అమెరికా సుంకాలను తగ్గించే దిశగా సరైన ప్రతిస్పందనలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇకపోతే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రకాల సుంకాలను విధించారు. మొదటి సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ సుంకం అన్ని దేశాలతో పోల్చితే 10 శాతం బేస్ టారిఫ్గా అమలు చేయబడుతుంది. గతంలో ఈ సుంకం 2.5 శాతంగా ఉండేది. ఈ నిర్ణయం ద్వారా అమెరికా అన్ని దేశాలకు బేస్ టారిఫ్ను పెంచింది. ఇక రెండో విషయానికి వస్తే., ప్రతి దేశంపై వేర్వేరు సుంకాలను విధించడం ప్రారంభించనుంది. అంటే ఒక దేశం అమెరికాపై 40 శాతం సుంకం విధిస్తే, అమెరికా ఆ దేశంపై 20 శాతం సుంకం విధించినట్లుగా సమాచారం. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అమెరికా భారతదేశంపై 26 శాతం సుంకం విధించబోతున్నట్లు సమాచారం.
Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!
ఈ కొత్త సుంకాల ప్రభావం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. అమెరికా సుంకాలను పెంచడం భారతదేశానికి కూడా కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు, కానీ ఈ సుంకాలను తగ్గించడానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఈ పరిణామాలను సమీక్షించి, అవసరమైన చర్యలను తీసుకుంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!