Rains Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని పేర్కొనింది. ఈ నెల 22వ తేదీ నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఈ నెల 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.
Read Also: Jabardasth Faima: బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన ఫైమా..ఈసారైనా?
అలాగే, నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, పలు వర్షం పడే సమయంలో పిడుగులు కూడా పడే అవకాశముందని పేర్కొనింది. ఈదురుగాలులు కూడా బలంగా వీచే ఛాన్స్ ఉందిని.. పొలాల్లో పని చేసే వారందరూ చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.