Champions Trophy 2025: ఐసీసీ కోర్టులో బంతి.. నేడు తేలనున్న ఛాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం!
- ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం
- ఐసీసీ కోర్టులో బంతి
- మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోన్న ఐసీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో.. టోర్నీ షెడ్యూల్పై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు నిర్వహిస్తే తాము ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇందుకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. పాకిస్థాన్లోనే పూర్తి టోర్నీ జరగాలని పట్టుపడుతోంది. ఐసీసీ చర్చలు జరిపినా.. పాక్ వెనక్కి తగ్గడం లేదు. హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఇందుకు బీసీసీఐ ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులో ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం ప్రస్తుతం ఐసీసీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హైబ్రిడ్ మోడల్లో మెజారిటీ మ్యాచ్లను పాక్లో నిర్వహించి.. టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై ఆడించాలని ఐసీసీ బావిస్తోంది. ఇందుకు పీసీబీ ఒప్పుకోకుంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తాన్ని పాకిస్థాన్ వెలుపల నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. టోర్నీని పాక్ నుంచి తరలించినా.. ఆతిథ్య హక్కులు మాత్రం పీసీబీ వద్దే ఉంటాయి. భారత్ లేకుండా పాక్లోనే టోర్నీ నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. ఐసీసీ ఇప్పుడు ఈ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.
Also Read
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
Also Read: WPL 2025: డిసెంబర్ 15న ఐపీఎల్ వేలం.. వేదిక ఎక్కడంటే?
భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే ఆర్థికంగా భారీ నష్టం కలుగుతుంది కాబట్టి.. ఐసీసీ మూడో ప్రత్యామ్నాయంను పరిశీలించడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మొదటి ప్రత్యామ్నాయానికి భారత్, ఐసీసీ మొగ్గు చూపుతుండగా.. పాకిస్తాన్ మాత్రం ససేమిరా అంటోంది. ఇక రెండో ప్రత్యామ్నాయాన్ని ఐసీసీ పరిశీలిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నుంచి తరలించాలని ఐసీసీ చూస్తోంది. ప్రస్తుతం ఇస్లామాబాద్లో రాజకీయ ఆందోళనలు జరుగుతుండటం కూడా మరో కారణం. నేడు వర్చువల్గా జరిగే సమావేశంలో టోర్నీ షెడ్యూల్పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!