Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Icc Agrees To Hybrid Model For Champions Trophy 2025 Bcci Accepts Pcb Demand

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ సందిగ్ధతకు తెర.. టీమిండియాకు షాక్!

Published Date :December 6, 2024 , 8:52 am
By Sampath Kumar
  • ఛాంపియన్స్‌ ట్రోఫీ సందిగ్ధతకు తెర
  • హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించిన ఐసీసీ
  • భారత్‌లో పాకిస్తాన్ పర్యటించదు
Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ సందిగ్ధతకు తెర.. టీమిండియాకు షాక్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025పై సందిగ్ధతకు తెర పడినట్లు తెలుస్తోంది. ట్రోఫీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌లో నిర్వహించనుంది. అంతేకాదు 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్‌లో పాకిస్తాన్ పర్యటించకుండా.. హైబ్రిడ్‌ విధానాన్ని కొనసాగించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2025 ఫిబ్రవరి, మార్చిలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం పాక్‌కు టీమిండియాను పంపమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. హైబ్రిడ్‌ మోడల్‌లో ఆడేందుకు తాము సిద్దమని ఐసీసీకి తెలిపింది. ఇందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఒప్పుకోలేదు. ఐసీసీ మధ్యవర్తిత్వం చేసినా ఫలితం లేకుండా పోయింది. హైబ్రిడ్‌ మోడల్‌కు ఒప్పుకోకుంటే టోర్నీని పాక్ నుంచి తరలిస్తామని పీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పింది. ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాక్.. ఓ కండిషన్ పెట్టింది. 2031 వరకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీల్లో పాక్ మ్యాచ్‌లను కూడా హైబ్రిడ్‌ విధానంలో నిర్వహిస్తామంటేనే.. ఇప్పుడు హైబ్రిడ్‌ విధానం ప్రతిపాదనకు అంగీకరిస్తామని పీసీబీ మెలిక పెట్టింది.

Also Read

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

Also Read: AUS vs IND: నా కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు.. భారత్‌ సిద్ధంగా ఉండాలి: రవిశాస్త్రి

ఐసీసీ ఛైర్మన్‌ జై షా, బోర్డు సభ్యుల మధ్య గురువారం అనధికార సమావేశం జరిగింది. ఇందులో ఛాంపియన్స్‌ ట్రోఫీ సందిగ్ధతకు తెరదించుతూ.. ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ వర్గాలు తెలిపాయి. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ మ్యాచ్‌లు భారత్‌ వెలుపల జరగనున్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026ను శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా భారత్‌ నిర్వహించనుంది. ఈ టోర్నీలోని పాక్‌ మ్యాచ్‌లకు లంకలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో టీమిండియాకు షాక్ తగిలింది. తమ దేశంలో ఎలాంటి సెక్యూరిటీ సమస్య లేదని, ఐసీసీ మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహిస్తామని బీసీసీఐ తెలపగా.. ఐసీసీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • Champions Trophy 2025
  • ind vs pak
  • india
  • Pakistan

తాజావార్తలు

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..

  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions