Phone Tapping Case: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. సిట్ విచారణలో ప్రభాకర్రావు సమాధానాలు!
- ముగిసిన ప్రభాకర్ రావు సిట్ విచారణ
- 9 గంటలు కొనసాగిన విచారణ
- ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం
- జూన్ 14న మరోసారి విచారణకు ప్రభాకర్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జూన్ 14న మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. నేడు సుదీర్ఘంగా ప్రభాకర్ రావుని సిట్ ప్రశ్నించింది. చాలా ప్రశ్నలకు ఎస్ఐబీ మాజీ చీఫ్ సమాధానాలను దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు అధికారికం, వ్యక్తిగతం అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి అయితే తెలీదు, గుర్తులేదు అంటూ ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చారు. కొంత సమాచారాన్ని ద్రువీకరించలేను అంటూ సిట్ అధికారులతో చెప్పారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జూన్ 14న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను కలిపి సిట్ విచారించనునట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రభాకర్ రావు నుంచి సిట్ స్వాదీనం చేసుకోలేదు. అయితే కొన్నింటికి రాత పూర్వకంగా సమాధానాలు తీసుకుంది. జూన్ 9న ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరైన విషయం తెలిసిందే. సిట్ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ముందు ఉంచి ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్ఫోన్లను తమకు అప్పగించాలని సిట్ అధికారులు మొదటిరోజు ఆదేశించారు. సెల్ఫోన్లతో పాటు ల్యాప్టాప్, మ్యాక్ నోట్బుక్లను సైతం తీసుకురావాలని సూచించారు.
Also Read
- Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
- Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
Also Read: Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా ఉన్నారు. కేసు నమోదైన సమయంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఆయన తిరిగి రాకపోవడంతో పోలీసులు పాస్పోర్టు రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో జూన్ 8న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
-
Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
-
EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..