Terrorists Killed: ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన అబు జిందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా, మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అయితే, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హఫీజ్ ముహమ్మద్ జమీల్.. జైషే మహమ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్ కు ఇతడు పెద్ద బావమరిది అవుతాడు.
Read Also: TTP and Baloch attacks: పాక్ నడ్డీ విరుస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్.. 22 మంది పాక్ సైనికులు మృతి
కాగా, మే 7వ తేదీన పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఐదుగురు కీలక టెర్రరిస్టులు మరణించారు. చనిపోయిన వారిలో జైషే- ఏ- మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కొడుకు హఫీజ్ జమీల్.. మసూద్ బావమరిది యూసఫ్, లష్కరే తోయిబా చీఫ్ అబు జిందాల్ తో పాటు లష్కరే తొయిబా తీవ్రవాద సంస్థతో మరో ఇద్దరికి సంబంధం ఉంది. కాగా, ముదస్సర్ అంత్యక్రియలను ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించిన “హఫీజ్ అబ్దుల్” ఆధ్వర్యంలో ఈ అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పాక్ లోని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న పాక్ సైన్యాధికారి, ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐజీ) హోదాలో పని చేస్తున్న పాకిస్తాన్ లోని పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి సైతం హాజరు అయ్యారు.