Suicide: భార్యను ‘టీ’ చేయమని చెప్పిన భర్త.. ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య
- బీహార్లోని భోజ్పూర్లో విషాద ఘటన
- భర్త 'టీ' చేయమని కోరగా నిరాకరించిన భార్య
- కోపంతో విషం తాగి ఆత్మహత్య
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని భోజ్పూర్లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త టీ చేయమని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
BV Raghavulu: బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి.. టీడీపీ, జనసేనలు జతకట్టడం సరికాదు..
Also Read
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఇమాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహ్తా గ్రామంలో జరిగింది. దంపతులు రాజ్ కుమార్ సాహ్, సుష్మా దేవి ఆసుపత్రిలో చేరిన తన తల్లిని చూసేందుకు వెళ్లారు. అయితే.. ఆ సమయంలో భర్త రాజ్ కుమార్ తన భార్యను ‘టీ’ చేసి ఇవ్వమని కోరాడు. భార్య అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చిన భర్త.. పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని ఆస్పత్రిలో ఉన్న భార్య సుష్మకు స్థానికులు తెలియజేశారు. వెంటనే భార్య ఇంటికి చేరుకుని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో పాట్నాకు తరలించారు. పాట్నాకు తరలిస్తుండగా భర్త రాజ్ కుమార్ మృతి చెందాడు.
అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి భార్య తనను తాను తిట్టుకుంటూ తీవ్రంగా రోధించింది. టీ చేసి తన భర్తకు ఎందుకు ఇవ్వలేదని ఆమె పదే పదే ప్రశ్నించుకుంటూ తీవ్ర దు:ఖ సాగరంలో మునిపోయింది. తన భర్త ఇలాంటి ఘటనకు పాల్పడతాడని అస్సలు అనుకోలేదని భార్య చెప్పింది. కాగా.. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?