Divorce: పెళ్లైన ఏడాదిన్నరకే.. భార్య వంట చేయడం లేదని విడాకులు కోరిన భర్త.. హైకోర్టు కీలక తీర్పు
- భార్య వంట చేయడం లేదని విడాకులు కోరిన భర్త
- ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక తీర్పు
- భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని హైకోర్టు తేల్చి చెప్పింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. భార్యభర్తలు కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకలా జీవించాలని సూచిస్తుంటారు. కానీ, నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ఆర్థిక కారణాలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు, అయిష్టం ఇలా రకరకాల కారణాలతో వివాహబంధాలను తెంపుకుంటున్నాయి కొన్ని జంటలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్లు మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య వంట చేయడం లేదని, తనను హింసిస్తుందని పెళ్లైన ఏడాదిన్నరకే విడాకులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం..
Also Read:Jaishankar-Venezuela: మదురో కిడ్నాప్పై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
- 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
- JP Nadda: "ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే".. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
ఎల్బీనగర్కు చెందిన ఒక వ్యక్తి భార్య వంట చేయడం లేదని, తన తల్లి వంట చేసేటప్పుడు భార్య సహకరించడం లేదని, ఇది క్రూరత్వం, హింసించడం కిందికి వస్తుందని కోర్టుకు విన్నవించాడు. తనకు విడాకులు మంజూరు చేయాలంటూ చేసిన అభ్యర్థనను కింది కోర్టు గతంలో కొట్టేసింది. సదరు భర్త కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిని జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆస్కారం ఉండకపోవచ్చునని పేర్కొంది.
వంట చేయకుండా తన తల్లికి సహకరించడం లేదంటూ భార్య క్రూరత్వానికి పాల్పడిందన్న భర్త వాదన ఆధారంగా విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. భార్య రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తారని, ఆమె వంట చేయకపోవడం భర్తను హింసిస్తున్నట్టుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అత్త వంట చేసేప్పుడు భార్య సహకరించకపోవడం హింసించడం కిందికి రాదని తీర్పులో పేర్కొంది. భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 వరకు ఆఫీసు విధుల్లో ఉండగా, భార్య ఉదయం 9 నుంచి 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారని, ఈ పనివేళల నేపథ్యంలో ఉదయం వేళ భార్య వంట చేయడం ఎలా సాధ్యమని కోర్టు ప్రశ్నించింది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్ని గొడవలు సర్వసాధారణం అని, వాటిని పరిష్కరించుకోకుండా విడాకులు కోరడం సమంజసం కాదని కోర్టు సూచించింది.
తాజావార్తలు
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
-
Clicky Ponting: ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్బై!
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
Item Songs: బాలీవుడ్లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
-
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!